శుక్రవారం ఉదయమే బులెటిన్, లైఫ్ సపోర్ట్పై బాలు, ఆరాతీసిన ఉప రాష్ట్రపతి
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం బులెటిన్లో విషమంగా ఆరోగ్యంగా ఉందని తెలుపడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వాస్తవానికి రాత్రి 12 గంటలకు మరో బులెటిన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వలేదు. దీంతో శుక్రవారం ఉదయం బులెటిన్ ఇవ్వొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని 10 మంది వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయనను లైఫ్ సపోర్ట్పై ఉంచారు. ఎస్పీ బాలు ఆరోగ్యం కుదుటపడాలని ఆయన అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఎస్పీ బాలు కరోనా బారిన పడి ఆగస్టు 5న ఎంజీఎంలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా నయమైనా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గలేదని వైద్యులు తెలిపారు.
Recommended Video
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరాతీశారు. ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వైద్యులతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాలు ఆరోగ్యం కాస్త క్రిటికల్ గానే ఉంది అని వైద్యులు తెలిపినట్టు సమాచారం. అయితే అవసరమైతే ఇతర వైద్యుల సాయం కూడా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications