కాంగ్రెస్ అభ్యర్థి తరుపున షోషల్ ప్రచారం చేసిన ముఖేష్ అంబానీ
ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మహమహ నాయకులే రంగంలోకి దిగుతున్నారు. కాగా ఈకోవలోకి బడా పారీశ్రామిక వేత్తలు సైతం చేరారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరాకు మద్దతుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, సైతం సోషల్ మీడియా ప్రచారంలో పాల్గోన్నారు.

ఈ ప్రచారంలో భాగంగా దక్షిణ ముంబయి కి చెందిన మిలింద్ కు పదేళ్ల రాజకీయ అనుభవం ఉంది. మిలింద్ కు ఇక్కడి సామాజిక ,ఆర్థిక , సాంస్కృతిక అంశాలపై అవగహన ఉందని నేను అనుకుంటున్నానని ఆ వీడియో మాట్లాడారు. కాగా మిలింద్ కు పలువురు ఇతర పారీశ్రామిక వేత్తలు కూడ మద్దతు పలికిన వీడియోను మిలింద్ ట్విట్టర్ లో పెట్టారు. కాగా దక్షిణ ముంబాయిలో ఏప్రిల్ 29 న జరగనున్న పోలింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications