Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో, తెలంగాణలో డబుల్: ఫలితాలపై ప్రధాని మోడీ స్పందన

న్యూఢిల్లీ: దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని నరేంద్రమోడీ. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచిందని వ్యాఖ్యానించారు.

మన దేశంలో ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఎన్నికల వల్లే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఎన్నికల సంఘం గర్వపడేలా చేసిందని అభినందించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పుకొచ్చారు.

NDA to be form govt for third time PM Modi on lok sabha results

1962 తర్వాత మూడోసారి ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాలేదు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించామన్నారు. తెలంగాణలోనూ బీజేపీకి ఉన్న సీట్లు డబుల్ అయ్యాయని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కేరళలో కూడా తొలిసారి ఒక సీటు గెలుచుకున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు.

అంతేగాక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఢిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశామని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు తమను ఆశీర్వదించారన్నారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నామన్నారు. తాము రాకముందు ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. 2014కి ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవన్నారు. తమ సేవలు చూసి ప్రజలు మూడోసారి పట్టం కట్టారని ప్రధాని మోడీ చెప్పారు.

12 కోట్ల మందికి సురక్షిత నీరు అందించామన్నారు ప్రధాని మోడీ. నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించామని తెలిపారు. దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తామని.. ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. తాము చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని తెలిపారు. మీ ఆశీర్వాదమే నిరంతరం పని పనిచేసేందుకు తనకు ప్రేరణ అని మోడీ చెప్పారు. తాజా లోక్‌సభ ఫలితాలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+