లండన్లో రాజకీయ ఆశ్రయం కోసం నీరవ్ మోడీ యత్నాలు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో రూ. 13వేలకోట్లకుపైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆయన అక్కడే రాజకీయ ఆశ్రయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
భారత్, బ్రిటిష్ అధికారులను ఉటంకిస్తూ ఓ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు బ్రిటన్ హోంశాఖ అధికారులు నిరాకరించారు. వ్యక్తిగత కేసుల్లో సమాచారం పంచుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తలపై నీరవ్ మోడీ కూడా స్పందించలేదు.

పీఎన్బీలో నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలు కలిసి రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మోసం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్.. ప్రస్తుతం లండన్లో ఉంటూ అక్కడ పొలిటికల్ ప్రాసిక్యూషన్ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా, పీఎన్బీ కేసులో నీరవ్, చోక్సీలతో కలిపి 25 మందిపై మే నెలలో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కూడా లండన్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications