సూపర్ ఏటీఎంలు వస్తున్నాయ్: ఇక బ్యాంకులకు వెళ్లక్కర్లేదు!
న్యూఢిల్లీ: ఏటీఎం తయారీదారుదారు, సేవలందించే ఎన్సీఆర్ కార్పొరేషన్ వినియోగదారులకు మరిన్ని సేవలందించే మల్టీ ఛానల్ ఏటీఎంలను రూపొందించింది. బ్యాంకుకు వెళ్లకుండానే ఈ ఏటీఎం మెషీన్ ద్వారా ఏటీఎం కార్డును కూడా పొందవచ్చు.
ఈ ఏటీఎం మెషీన్ భవిష్యత్లో బ్యాంకుగా కూడా సేవలందించే అవకాశాలున్నాయి. అయితే, ఈ ఏటీఎంల ఖరీదు రూ. 30-50లక్షల వరకు ఉంటుంది. అంతేగాక, మెషీన్ అందించే సేవలను బట్టి దాని ధరలో తేడాలుంటాయి.
SS32,SS22, SS83 అనే మూడు రకాల ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి సాధారణ ఏటీఎంలానే పనిచేస్తాయి కానీ, వీటిలో అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మెషీన్లలో బ్యాంక్ అకౌంట్ తెరవడంతోపాటు చెక్కును క్లియర్ చేసుకునే అవకాశం ఉండటం విశేషం.

ఇన్స్టాంట్ బ్యాంక్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్, ఆటోమేటిక్ సిగ్నేచర్ వేరిఫికేషన్, నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్ టాపప్స్ చేసుకోవడం లాంటి సేవలం వీటిలో అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వినియోగదారులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా దాదాపు తగ్గిపోనుంది.
త్వరలోనే పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకు రంగాలు సాధారణ ఏటీఎంల స్థానంలో ఈ మల్టీ ఛానల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నాయి. ఎన్సీఆర్ కార్పోరేషన్ ఈ ఏటీఎంలను విస్తారంగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను ఇప్పటికే చేసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications