బయటపడ్డ 'థార్' స్కామ్'..? అటవీశాఖపై చర్యలకు ఆదేశాలు..!
ఒడిశా రాష్ట్రంలో 'థార్ స్కామ్' వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రూ. 7 కోట్లు పెట్టి 51 మహీంద్రా థార్ వాహనాలను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ వాహనాలను మోడిఫికేషన్ చేసేందుకు మరో రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో వెల్లడించింది. ఈ క్రమంలో కేవలం వాహనాలకు చేసిన ఖర్చే రూ. 12 కోట్లకు చేరుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ బృందంతో దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ దాదాపు రూ. 7 కోట్లు ఖర్చు చేసి 51 మహేంద్ర థార్ వాహనాలను కొనుగోలు చేసింది. అయితే ఆ వాహనాలను మోడిఫై చేసేందుకు అదనంగా మరో రూ. 5 కోట్లు ఖర్చుచేసింది. అయితే వీటి కొనుగోలుపై సర్వత్రా విమర్శలు రావడంతో ఒడిశా ప్రభుత్వం రంగంలోకి దిగింది. అటవీ, పర్యావరణ శాఖ కొనుగోలు చేసిన వాహనాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మహీంద్రా థార్ వాహనాల కొనుగోలు, మాడిఫికేషన్ కు అయిన ఖర్చులపై ఆడిట్ నిర్వహించాలని పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో వన్యమృగాలను మానిటరింగ్ చేసేందుకు, అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసేందుకు, వేటను నిషేధించడం కోసం గతేడాది రూ. 7కోట్లతో 51 థార్ వాహనాలను కొనుగోలు చేశారు. అంటే ఒక్కో వాహనం కోసం రూ. 14 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మాడిఫికేషన్ కోసం ఒక్కో వాహనం మీద మరో రూ. 9 లక్షలు వెచ్చించారు.

మాడిఫికేషన్ లో భాగంగా థార్ వాహనాలకు అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చారు. అయితే థార్ వాహనాల్లో మార్పులు అవసరమా..? అన్న కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆడిటింగ్ సమయంలో ఏదైనా చట్టవిరుద్ధమైన, అనుమానాస్పద కార్యకలాపాలు బయటపడితే అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications