Onion Price: త్వరలో కేజీ రూ.40 తగ్గనున్న ఉల్లి ధర..!
పెరుగుతోన్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం కిలోకు సగటు ధర రూ.58 నుంచి జనవరి నాటికి కిలో ఉల్లి ధర రూ.40కి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. గత వారం దేశ రాజధానిలో కిలో ఉల్లి రూ. 80 దాటింది. దీంతో ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది.
ఉల్లి ధరలు కిలోకు రూ. 40 కంటే తక్కువగా ఎప్పుడు పడిపోతాయనే ప్రశ్నకు "అతి త్వరలో జనవరి" అని సింగ్ చెప్పారు. "ఎవరో కిలో రూ. 100కి చేరుకుంటుందని, ఇది ఎప్పటికీ రూ. 60 దాటదని మేము చెప్పాము. ఈ రోజు ఉదయం మొత్తం సగటు ఇప్పుడు కిలో రూ. 57.02 మరియు అది కిలో రూ. 60 దాటదు" అని సింగ్ అన్నారు.

ఎగుమతి నిషేధం రైతులను ప్రభావితం చేయదన్నారు. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (సిపిఐ)లో ఉల్లి ద్రవ్యోల్బణం జులై నుండి రెండంకెల స్థాయిలో ఉంది. అక్టోబర్లో దాదాపు నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయి 42.1 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అయ్యాయి.
విలువ పరంగా మొదటి మూడు దిగుమతి చేసుకునే దేశాలలో బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ ఉన్నాయి. ఎగుమతులను నిషేధించడానికి ముందు అక్టోబర్లో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్లలో కిలోకు రూ. 25 సబ్సిడీ రేటుతో బఫర్ ఉల్లిపాయ స్టాక్ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 28 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర (MEP) విధించింది.
ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారు. రైతు కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని చెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్లో జిల్లాలోని చంద్వాడ్ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు చేపట్టిన నిరసనకు శరద్ పవార్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications