Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో ఓటు, రేషన్ కార్డు.. పాకిస్తానీ సంచలన వ్యాఖ్యలు!

తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం వీసాలను రద్దు చేయడంతో దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాను గత 17 ఏళ్లుగా భారత్‌లోనే నివసిస్తున్నానని, ఇక్కడి ఎన్నికల్లో ఓటు వేశానని, రేషన్ కార్డు కూడా ఉందని అతను పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో, పాకిస్తాన్ పౌరుడిగా ఉండి కూడా అతను భారత్‌లో ఎలా ఓటు వేయగలిగాడనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

గత 17 ఏళ్లుగా భారత్‌లోనే..
ఉసామాగా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి వీడియోలో మాట్లాడుతూ, తాను భారత్‌లోనే తన పాఠశాల విద్యను పూర్తి చేశానని, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నానని చెప్పాడు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసారన్ లోయలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిని ఖండించిన అతను, తనకు ఎటువంటి భవిష్యత్తు లేని పాకిస్తాన్‌కు ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించాడు. అట్టారీ సరిహద్దు వద్ద మాట్లాడుతూ.. "నేను గత 17 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. నేను ఇక్కడ ఓటు వేశాను, నాకు రేషన్ కార్డు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు."

pahalgam-fallout-pakistani-leaving-india-claims-voting-ration-card-for-17-years

ఒక పాకిస్తానీ జాతీయుడు భారతీయ ఎన్నికల్లో ఓటు వేయడం, భారతీయ రేషన్ కార్డు కలిగి ఉండటం దేశ ఎన్నికల ప్రక్రియ పవిత్రతపై, భద్రతాపరమైన అంశాలపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది. అక్రమ వలసదారులు దేశంలో నివసిస్తూ, భారత పౌరులకు లభించే హక్కులను పొందడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆక్రమ వలసదారులతో సురక్షితమేనా?

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లా బైసారన్ లోయలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి, ఉగ్రవాదులపై భారీ ఎత్తున అణచివేత చర్యలు ప్రారంభించింది. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేసి, వారిని గుర్తించింది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులు కాగా, మూడవ వ్యక్తి కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నివాసి. ఈ ఉగ్రవాదుల ఇళ్లను, వారితో సంబంధం ఉన్న మరికొందరి ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

భారత్ కఠిన చర్యలు

ఈ దాడి అనంతరం భారత ప్రభుత్వం దౌత్యపరంగా కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తానీ దౌత్యవేత్తలను బహిష్కరించి, ఇస్లామాబాద్‌లోని భారతీయ అధికారులను వెనక్కి పిలిపించింది. అట్టారీ సరిహద్దును కూడా మూసివేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందిస్తూ, "ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉండి వారికి సహకరిస్తున్న వారిని భారత్ గుర్తిస్తుంది, పట్టుకుంటుంది, శిక్షిస్తుంది. భూమి చివరి అంచుల వరకు వారిని వెంబడిస్తాం" అని హెచ్చరించారు.

దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఈ దాడిలో తమ ప్రమేయాన్ని ఖండించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ "నిష్పాక్షిక విచారణకు" పిలుపునిచ్చారు. అంతేకాకుండా, సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ 'యుద్ధ హెచ్చరిక' జారీ చేసింది. ప్రతిగా, సిమ్లా ఒప్పందాన్ని రద్దుతో పాటు, భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

పాకీస్తానీకి భారత ఎన్నికల వ్యవస్థలో చోటు ఎలా?

ఈ ఉద్రిక్తతల నడుమ, పాకిస్తానీ వ్యక్తి తాను భారత్‌లో 17 ఏళ్లుగా నివసిస్తూ, ఓటు వేయడమే కాకుండా రేషన్ కార్డు కూడా పొందానని చేసిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక విదేశీయుడికి, అది కూడా శత్రు దేశానికి చెందిన వ్యక్తికి, భారతీయ ఎన్నికల వ్యవస్థలో ఎలా చోటు దొరికింది? అక్రమ వలసదారుల సమస్య దేశ భద్రతకు, ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు ఏ స్థాయిలో ముప్పు కలిగిస్తుందో ఈ సంఘటన ఎత్తి చూపుతోంది. ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విశ్లేషకులు, భారతీయులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+