ఫోన్ మాట్లాడుతూ బెంగళూరులో 9వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి
బెంగళూరు: హోలీ సంబరాల సందర్భంగా బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న 28 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజినీర్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశాడు.
ఈ సంఘటన గురువారం సౌత్ ఈస్ట్ బెంగళూరు, బెల్లండూర్లో జరిగింది. గౌతమ్ కుమార్ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మరో ఐదుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు.
రాత్రి 11 గంటల సమయంలో గౌతమ్కు తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. అతను బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి పడి మృతి చెందాడు.

4 అడుగులు ఉన్న బాల్కనీ గోడ వద్ద అదుపు తప్పి అతను కిందపడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత పదిహేను నిమిషాలకు అక్కడున్న స్నేహితులు అతను కిందపడినట్లుగా గుర్తించారు.
వెంటనే సెక్యూరిటీ గార్డు సహాయంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు, ఇతర స్నేహితులకు సమాచారం అందించారు. శుక్రవారం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇతనిది పాట్నా. సోదరి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications