target: హిందువులు టార్గెట్, ప్రవీణ్ హత్య శాంపిల్ మాత్రమే, దేశంలో ఇస్లామిక్ పాలనే పీఎఫ్ఐ లక్షం, ఎన్ఐఏ !
బెంగళూరు/మంగళూరు: సమాజంలో ఉగ్రవాదాన్ని పోత్సహించడం, మత విద్వేషాలు, అశాంతి సృష్టించేందుకు మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టారు అలియాస్ ప్రవీణ్ ను పీఎఫ్ఐ సంస్థ హత్య చేసిందని అధికారులు అంటున్నారు.. దేశంలో వారు పెట్టుకున్న టార్గెట్ లోపు ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే పీఎఫ్ఐ ఎజెండా, అందుకులో భాగంగానే హిందూ సంఘ, సంస్థ నాయకులు హత్య చెయ్యాలని పీఎఫ్ఐ డిసైడ్ అయ్యిందని, అందులో ప్రవీణ్ హత్య ఒక భాగం అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ప్రవీణ్ నెట్టారు హత్యకు సంబంధించి వివరాలు తెలిపారు. ప్రవీణ్ హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జషీటు దాఖలు చేశారు.
Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !
హిందువులను టార్గెట్ చేసిన పీఎఫ్ఐ
హిందూ సమాజంలో ఆందోళన కలిగించేందుకే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిందని జాతీయ దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది.
మంగళూరుకు చెందిన బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో పలు అంశాలను ప్రస్తావించారు. హిందూ సమాజంలో ఆందోళన కలిగించేందుకు ప్రవీణ్ ను హత్య చేశారని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు.
ఒక్కడి హత్యకు 20 మంది స్కెచ్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులే ప్రవీణ్ ను హత్య చేశారని కేసు విచారించిన ఎన్ఐఏ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. 2022 జూలై 26వ తేదీన దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలూకా బెల్లారేలో ప్రవీణ్ ను దారుణంగా హత్య చేశారు. ప్రవీణ్ కేసులో మొత్తం 20 మంది నిందితుల మీద ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. శుక్రవారం బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ అధికారులు చార్జిషీట్ సమర్పించారు. 20 మంది నిందితుల మీద ఎన్ఐఏ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2047 నాటికి దేశంలో ఇస్లామిక్ పాలన తీసుకురావాలని పీఎఫ్ఐ ప్లాన్ చేస్తోందని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు చెప్పారు.
1,500 పేజీల చార్జ్ షీట్..... 240 మంది సాక్షులు
20 మంది నిందితుల్లో 15 మందిని అరెస్టు చేయగా, ఐదుగురు పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. నిందితుల్లో నాలుగో నిందితుడు ముస్తఫా పైచారు, ఆరో నిందితుడు కొడాజె మహ్మద్ షరీఫ్, ఐదో నిందితుడు మసూద్, ఏడో నిందితుడు అబూబకర్ సిద్ధిక్, 20వ నిందితుడు తుఫైల్ తప్పించుకుని తిరుగుతున్నారని, వారిని పట్టించినా, ఆచూకి చెప్పినా ఎన్ఐఏ అధికారులు రివార్డు అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ప్రవీణ్ హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు ఏకంగా 1, 500 పేజీల సుదీర్ఘ చార్జిషీట్ను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో 240