స్మృతి ఇరానీ కేసు: ఉద్దేశ్యపూర్వకంగానే కెమెరాల ఏర్పాటు
పనాజీ: గోవాలోని ఫ్యాబ్ ఇండియా గార్మెంట్స్ షోరూంలోని ట్రయల్ రూంలో ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని గోవా పోలీసులు తెలిపారు. వారు ప్లాన్లో సూచించిన ప్రకారం కెమెరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులు బెయిల్పై విడుదలయ్యారు.

వారిని పోలీసు కస్టడీకి ఎందుకు కోరలేదన్న విమర్శలపై పోలీసులు స్పందిస్తూ ఆ అవసరం రాలేదని చెప్పారు. ఆ కెమెరా గత కొద్ది నెలలుగా ఉన్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన బాధితులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం.
ఈ కేసులో నిందితులను తప్పకుండా శిక్షిస్తామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సునీల్ గార్గ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో దాదాపు 45 షోరూంలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఉంచిన స్థలాన్ని మార్చాలని అందులో పేర్కొన్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications