స్మృతి ఇరానీ కేసు: ఉద్దేశ్యపూర్వకంగానే కెమెరాల ఏర్పాటు
పనాజీ: గోవాలోని ఫ్యాబ్ ఇండియా గార్మెంట్స్ షోరూంలోని ట్రయల్ రూంలో ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని గోవా పోలీసులు తెలిపారు. వారు ప్లాన్లో సూచించిన ప్రకారం కెమెరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులు బెయిల్పై విడుదలయ్యారు.

వారిని పోలీసు కస్టడీకి ఎందుకు కోరలేదన్న విమర్శలపై పోలీసులు స్పందిస్తూ ఆ అవసరం రాలేదని చెప్పారు. ఆ కెమెరా గత కొద్ది నెలలుగా ఉన్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన బాధితులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం.
ఈ కేసులో నిందితులను తప్పకుండా శిక్షిస్తామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సునీల్ గార్గ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో దాదాపు 45 షోరూంలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఉంచిన స్థలాన్ని మార్చాలని అందులో పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications