వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ వర్సెస్ పీకే: మోడీకి దండం పెడుతున్న ఫోటో షేర్..

|
Google Oneindia TeluguNews

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వర్సెస్ బీహర్ సీఎం మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. పీకే బీజేపీతో ఉండాలని అనుకుంటున్నారని నితీశ్ అగ్నికి ఆజ్యం పోశారు. దీనికి ప్రశాంత్ కూడా అదేవిధంగా స్పందించారు. మోడీకి దండం పెట్టే.. నమస్కారం చేసే ఫోటోలను కూడా షేర్ చేశారు. రెండు ఫోటోలను ట్వీట్ చేసి.. విమర్శలు చేశారు.

బీజేపీతో ఇదివరకు జేడీయూ కలిసి ఉంది. ఆ సమయంలో తీసినవే ఈ ఫోటోలు.. వాటిని పీకే పోస్ట్ చేశారు. గత నెలలో నితీశ్ బీజేపీకి షాక్ ఇచ్చి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి విపక్షాల ఐక్యతను చాటాలని ట్రై చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాలు గెలిచేందుకు వ్యుహా రచన చేస్తున్నాయి.

Prashant Kishor takes a dig at Nitish Kumar with tweet

పీకే రహస్యంగా బీజేపీ కోసం పని చేస్తున్నారని నితీశ్ ఆరోపించడంతో అగ్గిరాజేసింది. నెల క్రితం అధికారం పక్షంతో ఉన్న నితీశ్ కుమార్, ఇప్పుడు విపక్షంతో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండలేరని చెప్పారు. బిహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు.

పీకే.. నితీశ్‌తోను కలిసి పనిచేశారు. ఆ పార్టీలో కూడా చేరారు. కానీ రెండు కత్తులో ఒక ఒరలో ఇమడలేవన్నట్టు.. పార్టీని వీడారు. అప్పటినుంచి వీరి మధ్య దూరం పెరిగింది. తెలంగాణలో కేసీఆర్‌తో పీకే పనిచేస్తున్నారు. ఏపీలో జగన్‌తో కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో పీకే వ్యుహలు పనిచేసి.. వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary
Prashant Kishor posted set of photos that showed Nitish Kumar greeting PM Modi with folded hands and a smile on his face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X