మోడీ పర్యటన: కాశ్మీర్ లో రెడ్ అలర్ట్
శ్రీనగర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న సందర్బంగా అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందు జాగ్రత్త చర్యగా సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో గట్టి నిఘా వేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రజలలో కలిసిపోయారు. ఎవ్వరూ నల్ల జెండాలు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
షేర్ ఈ కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాటు చేశారు. అక్కడ మోడీ ప్రసంగించనున్నారు. తిరుగుబాటుదారులు స్టేడియంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు చోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా వందలమందిని అదుపులోకి తీసుకున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలలోని ఎత్తయిన భవనాల మీద షార్ప్ షూటర్స్ ను పెట్టారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు.