మీ స్వార్థం కోసం విద్యార్థులను వాడుకుంటారా?: గౌతం గంభీర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన విద్యార్థులు ఆందోళనలపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. వర్సిటీ విద్యార్థుల ఆందోళనలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు.
'ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థులను ప్రేరేపిస్తూ ప్రసంగించిన వీడియోను నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఎన్నో లక్ష్యాలను సాధించాలని ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చిన విద్యార్థులతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం' అని అరవింద్ కేజ్రీవాల్ పార్టీపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేటి యువతే ఈ దేశానికి భవిష్యత్తు, మార్గనిర్దేశకులు. కులమతాలకు అతీతంగా ఈ దేశం ప్రతిఒక్కరిదీ. దేశ అభివృద్ధికి అందరూ పాటుపడుతున్నారు. అలాంటి వారికి నిరసన తెలిపేందుకు అన్ని హక్కులు ఉంటాయి. కానీ, అది ప్రజాస్వామ్య పద్ధతి చేయాలి. ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది' అని గౌతమ్ గంభీర్ హితవు పలికారు.
एक उप मुख्यमंत्री को संवैधानिक पद पर बैठ कर झूठ फैलाने से बचना चाहिए।ये स्वार्थ और फ़रेब की बुनियाद पर बनी सरकार आज दिल्ली को जला रही है।अपने स्वार्थ के लिए इस स्तर की राजनीति करना अपराध है। pic.twitter.com/cdjGeZbp88
— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2019
'పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం వల్ల దేశ పౌరులెవరూ పౌరసత్వం కోల్పోయేది లేదు. విద్యార్థులు ఎవరూ చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోకూడదని కోరుతున్నాను. ఈ చట్టం భారతీయులకు వ్యతిరేకంగా కాదు. దీనికి ఎవరూ రాజకీయం చేయొద్దు' అని గౌతమ్ గంభీర్ అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పౌర సవరణ చట్టంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే.
राजनीतिक स्वार्थ के लिए @AamAadmiParty के विधायक अमानतुल्लाह खान के इस तरह के भड़काऊ भाषण से पार्टी की असलियत एक बार फिर से सबके सामने आयी है. @ArvindKejriwal जी को दिल्ली की जनता ऐसी गन्दी राजनीति के लिए कभी माफ़ नहीं करेगी.मैं सभी से शांति की अपील करता हूँ । pic.twitter.com/12v4FfVF1S
— Gautam Gambhir (@GautamGambhir) December 15, 2019
పౌరసత్వ సవరణ చట్టంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని..చట్టాన్ని అమలు చేసి తీరుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications