విమానంలో త్రిశూలం: రాధే మాకు కొత్త కష్టాలు
ముంబై: వివాదస్పద ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. త్రిశూలం చేత పట్టుకుని విమానంలో ప్రయాణించారని ఓ సామాజిక కార్యకర్త ( ఆర్ టీఐ కార్యకర్త) దాఖలు చేసిన ఫిటీషన్ లో బాంబే హై కోర్టు స్పందించడంతో ఆమె వివాదంలో చిక్కుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో రాధే మా ఔరంగాబాద్ నుంచి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో రాధే మా త్రిశూలం చేతపట్టుకున్నారు. ఈ విషయం పై సామాజిక కార్యకర్త రమేష్ జోషి బాంబే హై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను రాధే మా అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం పిటీషన్ విచారణకు స్వీకరించింది.
పిటీషన్ విచారణ చేసిన జస్టిస్ వి.ఎం. కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ నవంబర్ 18 లోపు అఫిడవిట్ దాఖలు చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే పీలకదాక కష్టాల్లో ఉన్న రాధే మాకు కొత్త చిక్కు వచ్చిపడింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications