Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రం నాశనం కావడానికి ఎవరు కారణం, మండిపడిన యువరాజు రాహుల్ గాంధీ!

బెంగళూరు/న్యూఢిల్లీ: సుమారు 110 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జాతి వివాదాలతో అట్టుడుకుతున్న రాష్ట్ర పరిస్థితిపై ఈ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

కొన్ని రోజుల నుంచి మణిపూర్ హింసాచారం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇంత మంది చనిపోయిన తరువాత మీకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆలోచన వచ్చిందా. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోవాలి, హింస ప్రారంభం అయిన మొదట్లోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేదా అని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 Rahul Gandhi is angry that the central government has not taken proper action on the violence in Manipur

అఖిలపక్ష సమవేశంలో ప్రధాని నరేంద్ర మోదీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సుమారు 50 రోజుల నుంచి మణిపూర్ రగిలిపోతున్నదని, అయితే ప్రధాన నరేంద్ర మోదీ చాలా మౌనంగా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని, అంతకు ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఇలా జరిగేదా ? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

 violence in Manipur

మణిపూర్ లో జరిగిన హింసకు ఎవరు కారణం ?, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా ? అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మణిపూర్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని. అన్ని సమస్యలు చర్చలు ద్వారానే పరిష్కారం అవుతాయని, అంత వరకు ఓపికతో ఉండాలని రాహుల్ గాంధీ మణిపూర్ ప్రజలకు మనవి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+