మ్యాగీకి దెబ్బ: మార్కెట్లోకి రాందేవ్ బాబా నూడుల్స్
న్యూఢిల్లీ: భారత్లో మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురయ్యయాని బాధపడుతున్న తల్లులు ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విదేశీ మ్యాగీ నూడుల్స్కు ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా స్వచ్ఛమైన ఆటా (గోధమ పండి) తో తయారు చేసిన నూడుల్స్ను మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ నూడుల్స్ను విడుదల సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ ఈ నూడుల్స్ గోధమ పిండి నుంచి తయారైన విషయాన్ని మరిచిపోకండన్నారు. ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్ల రసాలను ఉత్పత్తి చేస్తున్న తమ సంస్ధ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కొత్తగా ఆటా నూడుల్స్ను తయారు చేస్తుందన్నారు.

ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా పిండిని కలపలేదని, మ్యాగీ నూడుల్స్ స్ధానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇవి ఉంటాయని తెలిపారు. గురువారం ఉత్తరప్రదేశ్లో గల హరిద్వార్లోని తన ఆశ్రమంలో రాందేవ్ బాబా ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇక మ్యాగీ నూడుల్స్లో మోతాదుకు మించిన సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications