తాజ్, ప్రెసిడెంట్ బిల్డింగ్ కూల్చాలి: అజంఖాన్
లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, యూపి మంత్రి అజమ్ ఖాన్ ఎప్పుడూ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. శనివారం మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ ఫ్యూడలిజానికి చిహ్నమని ఆయన అన్నారు.
రాష్ట్రపతి భవన్తో పాటు పార్లమెంటు భవనం, తాజ్ మహల్లను ఆయన బానిసత్వానికి చిహ్నాలుగా అభివర్ణించారు. బానిసత్వానికి గుర్తులుగా ఉన్న ఆ మూడు భవనాలను కూల్చివేయాలని ఆయన శనివారం నాడు డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన రజా డిగ్రీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కోసం ఖర్చు చేస్తున్న ధనమంతా వృథానేనని అన్నారు.

దేశంలో బానిసత్వానికి చిహ్నాలు ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే.. ఆ జాబితాలో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్మించిన రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనాలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నెంబర్ వన్ ఫ్యూడలిజానికి తాజ్ మహల్ నిదర్శనమని మనమంతా కచ్చితంగా అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఆ తర్వాత జాబితాలో రాష్ట్రపతి నిలయం, పార్లమెంటు భవన్ వస్తాయన్నారు. వాటిని పడగొట్టాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications