హెల్మెట్ లేకుండా బైకు నడిపితే... కొత్త పనిష్మెంట్ ఇస్తున్న ట్రాఫిక్ పోలీసులు
భోపాల్: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చాలా భారీగా ఉంటున్నాయి. అసలు వాహనంలో వెళ్లడంకంటే ప్రభుత్వం అధీనంలో నడిచే బస్సుల్లో ప్రయాణం చేయడం మంచిదన్న ఆలోచన చేస్తున్నారు వాహనదారులు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్లో వెరైటీ పనిష్మెంట్
కొన్ని రోజుల క్రితం కోటి రూపాయలు పెట్టి పోర్షే లగ్జరీ కారు కొన్న ఓ కస్టమర్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.30 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా వెలుగులోకి వచ్చాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జరిమానా విధానాలను తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనదారులకు వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

హెల్మెట్ ధరించడం మరిచామో...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కితే వారితో ఓ ఎస్సే రాయిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకును నడుపే వారికి మాత్రమే ఈ వెరైటీ పనిష్మెంట్. అసలు హెల్మెట్ ఎందుకు ధరించలేదో, హెల్మెట్ మర్చిపోయామని కాకమ్మ కథలు చెబితే ఎందుకు మర్చిపోయారో కారణం చెబుతూ ఒక ఎస్సే రాయిస్తున్నారు.

100 పదాలతో కూడిన ఎస్సే
గత ఆరురోజులుగా భోపాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు దాదాపు 150 మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకున్నారు. వీరంతా హెల్మెట్ ధరించకుండా బైకును నడుపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరితో 100 పదాలతో కూడిన ఎస్సే రాయించారు ట్రాఫిక్ పోలీసులు. జనవరి 11 నుంచి 17 వరకు రోడ్ సేఫ్టీ వీక్ ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులచే పనిష్మెంట్ కింద ఈ ఎస్సే రాయిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక శుక్రవారంతో ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ముగుస్తాయి.

రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా అవగాహన
రోడ్ సేఫ్టీ వారోత్సవంలో భాగంగా గత ఆరురోజులుగా ట్రాఫిక్ నిబంధనలపై సామాన్యులకు, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా పామ్ప్లేట్లు కూడా ముద్రించి పంచారు. ట్రాఫిక్ రూల్స్ గురించి వాటిని పాటించకపోతే ఎలాంటి జరిమానాలు విధించబడుతాయో అనేవి ముద్రించారు. అంతేకాదు ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు కూడా ఈ వారోత్సవాల్లో భాగంగానిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications