జయలలిత మేనకోడలు దీప మీద రూ. 1.12 చీటింగ్ కేసు: మోసం చేశారు, అమ్మ పేరు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్, ఆమె భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజా తనను మోసం చేశారని, రూ. 1.12 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యాపారవేత్త చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

కొత్త పార్టీ
జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు దీప ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పార్టీని స్థాపించారు. ఆ సందర్బంలో చెన్నైలోని ఇంజంబాక్కంలో నివాసం ఉంటున్న ఎరువుల వ్యాపారి రామచంద్రన్ దీప ను కలిశారని తెలిసింది.

జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పార్టీలో తనకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.12 కోట్లు తీసుకున్నారని, తరువాత తనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని, తీసుకున్న నగదు తిరిగి ఇవ్వలేదని సోమవారం రామచంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

అమ్మ పేరు ప్రతిష్టలు
తాను జయలలిత మేనకోడలు అంటూ అమ్మ పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకుని దీప ప్రజలను మోసం చేస్తున్నారని, తనను అలాగే మోస చేశారని, తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇప్పించాలని వ్యాపారి రామచంద్రన్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

విచారణ ముమ్మరం
రామచంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై సిటీ పోలీసులు జయలలిత మేనకోడలు దీప, ఆమె భర్త మాధవన్, కారు డ్రైవర్ రాజా రూ. 1.12 కోట్లు తీసుకుని మోసం చేశారా ? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసు విషయంలో ఎంజీఆర్ అమ్మా దీప పేరవైలోని కొందరు నాయకులను విచారణ చేస్తున్నారు.

కేసు పెట్టిన దీప
ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత జయంతి వేడుకలు నిర్వహించడానికి తాను ఏర్పాట్లు చేస్తుంటే శశికళ, టీటీవీ దినకరన్ వర్గీయులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవలే దీప చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications