మోహన్ భగవత్కు కూడా కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక..
కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల ప్రవాహం కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు కూడా కరోనా వైరస్ వచ్చింది.
మార్చి 7వ తేదీన ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీతో కలిసి మోహన్ భగవత్ టీకా వేయించుకున్నారు. నాగ్ పూర్ నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్లో టీకా తీసుకున్నారు. మరో డోసు తీసుకోవాల్సి ఉండగా.. భగవత్ కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం నాగ్పూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆరెస్సెస్ శ్రేణులు తెలిపాయి.

నాగ్పూర్ కింగ్ వే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని వివరించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 1.31 లక్షలకు చేరాయి. 780 మంది చనిపోయారు. మొత్తం మరణాలు లక్షా 67 వేల 642 మందికి చేరింది.
కరోనా కేసులు పెరగడంతో రాత్రి కర్ఫ్యూ.. వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీలో రాత్రి పూట విధించారు. ఢిల్లీలో 83.29 శాతం కొత్త కరోనా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయి.
-
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. ఆరు సార్లు ఎంపీగా సేవలు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం: పీఎం మోదీ ఆందోళన.. ఇండియాలో ఈ వస్తువుల ధరాఘాతం! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
ఈ టైమ్ లో కిమ్ ఎంటర్ అయితే ఉంటది నా సామిరంగ- ఊ అంటే చాలు -
Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! తాజా ఉత్తర్వులు..! -
Donald Trump: గల్ఫ్ దేశాల్లో షాకులతో ట్రంప్ బిగ్ యూటర్న్..! ఇరాన్ పై తాజా ప్లాన్ ..! -
16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..! -
viral video: యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం..












Click it and Unblock the Notifications