స్వామి నిత్యానంద అరెస్టుకు రంగం సిద్దం, అమిత్ షాకు తల్లి లేఖ, సీబీఐతో!
చెన్నై/బెంగళూరు: బెంగళూరు నగరం సమీపంలోని బిడిదిలోని ధ్యానపీఠ ఆశ్రమం నిర్వహిస్తూ తనకు తానుగా ధైవ మానవుడు అంటూ ప్రచారం చేసుకున్న నిత్యానందకు సినిమా కష్టాలు ఎదురైనాయి. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన బీసీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను భారత్ రప్పించి అరెస్టు చెయ్యాలని మృతురాలి తల్లి, నిత్యానంద ఆశ్రమయంలో లైంగిక వేధింపులకు గురైన ఆర్తిరావ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

బీసీఏ పట్టభద్రురాలు
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని నవలూరు మేలవీధిలో నివాసం ఉంటున్న అర్జునన్ రావ్, ఝాన్సీరాణి (55) దంపతులకు ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. అర్జునన్, ఝాన్సీరాణి మూడో కుమార్తె సంగీత ప్రముఖ కాలేజ్ లో బీసీఏ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

నిత్యానంద ఆశ్రమంలో!
బీసీఏ పూర్తి చేసిన సంగీత చెన్నై, బెంగళూరు శివార్లలోని నిత్యానంద ఆశ్రమంలో జరిగే ప్రత్యేక తరగతులకు హాజరు కావడానికి వెళ్లి వస్తూ ఆయన భక్తురాలు అయ్యింది. నిత్యానంద ఆశ్రమంలోని ఆయన శిష్యుడు ప్రాణానంద 2014 డిసెంబర్ 28వ తేదీన సంగీత తల్లి ఝాన్సీరాణికి ఫోన్ చేశాడు. మీ కుమార్తె సంగీత గుండెపోటుతో మరణించిదని, వచ్చి మృతదేహం తీసుకెళ్లాలని ఝాన్సీరాణికి ఫోన్ లో చెప్పాడు.

నిత్యానంద మీద పోలీసు కేసు
తన కుమార్తె సంగీత మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి తనకు న్యాయం చెయ్యాలని ఝాన్సీరాణి బెంగళూరు నగర శివార్లలోని రామనగర పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో సంగీత అనుమానాస్పద మృతిపై రామనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

అమిత్ షాకు లేఖ
సంగీత మృతిపై ఆమె తల్లి ఝాన్సీరాణి అనుమానం వ్యక్తం చెయ్యడంతో 2015లో తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శరవణ సంగీత మృతదేహానికి రీపోస్టుమార్టుం నిర్వహించారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను భారత్ రప్పించి అరెస్టు చేసి తమకు న్యాయం చెయ్యాలని సంగీత తల్లి ఝాన్సీరాణి, నిత్యానంద ఆశ్రమంలో లైంగిక వేధింపులకు గురైన ఆర్తిరావ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

సీబీఐ విచారణ!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయంపై సంగీత తల్లి ఝాన్సీరాణి తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె అనుమానాస్పద మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అమిత్ షాకు మనవి చేశామని అన్నారు. సీబీఐతో విచారణ జరిపించి నిత్యానందతో పాటు ఆయన శిష్యులను కఠినంగా శిక్షించినప్పుడే తన కుమార్తె సంగీత ఆత్మకు శాంతిచేకూరుతుందన ఝాన్సీరాణి అన్నారు. మొత్తం మీద నిత్యానందను ఇదే కేసులో భారత్ రప్పించి కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications