hot topic: సీఎం, హోమ్ మంత్రిని పరుగులు పెట్టించిన స్యాంట్రో రవి, నో బెయిల్ !
బెంగళూరు/మైసూరు: కొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా కింగ్ మేకర్ మేమే కావాలని జేడీఎస్ ప్రయత్నిస్తున్నది. ఇలాంటి సమయంలో స్యాంట్రో రవి అనే వ్యక్తి కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాడు. తాను అధికార పార్టీ నాయకుడు అని చెప్పుకుని తిరిగిన స్యాంట్రో రవి అధికారులను వారికి ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడికి బదిలీ చేయిస్తానని చెప్పి లక్షల్లో వసూలు చేశాడని, ఇప్పటికే కోట్ల రూపాయలు అలా సంపాధించాడని ఆరోపణలు ఉన్నాయి. స్యాంట్రో రవి దెబ్బకు సీఎం, హోమ్ మంత్రితో సహ అందరూ పరేషాన్ అవుతున్నారు.
సీఎం, హోమ్ మంత్రి ఆదేశాలు
ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి పలు స్కామ్ లకు తెరలేపిన స్యాంట్రో రవి కోసం కర్ణాటక పోలీసులు 11 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. స్యాంట్రో రవిని వెంటనే అరెస్టు చెయ్యాలని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బవరాజ్ బోమ్మయ్, కర్ణాటక హోమ్ మంత్రి డీజేపీ ప్రవీణ్ సూర్ కు ఆదేశాలు జారీ చేశారంటే అతను చేసిన స్కామ్ ల గురించి అర్థం అవుతోంది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం
స్యాంట్రో రవి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మైసూరులో కోర్టును ఆశ్రయించాడు. స్యాంట్రో రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలిస్తున్నారు. స్యాంట్రో రవి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన మైసూర్లోని 4వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించి పిటిషన్ ఇదే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వ లాయర్ వాదన
స్యాంట్రో రవి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలను దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని కోర్టుకు మనవి చేశారు. దీంతో కోర్టు ప్రభుత్వ న్యాయవాదికి సమయం ఇస్తూ పిటిషన్ విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు, దరఖాస్తు విచారణ సందర్భంగా వచ్చే గురువారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ దెబ్బతో స్యాంట్రో రవి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జనవరి 17వ తేదీకి వాయిదా పడింది.
సార్ కోసం 11 ప్రత్యేక బృందాలు గాలింపు
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెంటనే స్యాంట్రో రవిని అరెస్టు చెయ్యాలని మైసూరు పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. స్యాంట్రో రవిని పట్టుకునేందుకు కర్ణాటక పోలీసులు 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్యాంట్రో రవిపై మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు ,నమోదు అయ్యింది.
హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు
గురువారం స్యాంట్రో రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రామనగర్ కు వెళ్లారు. అయితే స్యాంట్రో రవి కారు డ్రైవర్ మాత్రం పోలీసులకు చిక్కాడు. స్యాంట్రో రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో స్యాంట్రో రవి అంశం హాట్ టాపిక్గా మారింది. రవి అరెస్ట్లో జాప్యం చేసినందుకు బీజేపీ ప్రభుత్వం మీద విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది.