నేడు కోర్టులో లొంగిపోనున్న శశికళ!: లీగల్ అడ్వైజర్ల సూచన ఇదే, జయ బ్యారక్కే శశి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం.
బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం. సహ నిందితులు ఇళవరసి, సుధాకరణ్ లతోపాటు శశికళను లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శశికళ తన లీగల్ అడ్వైజర్ల సూచన మేరకు కోర్టు ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోర్టులో లొంగిపోయిన తర్వాతే రివ్యూ పిటిషన్ వెళ్దామని ఆమెతో వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోర్టు ఎదుట లొంగిపోవాలని శశికళ నిర్ణయించుకున్నారు.
లొంగిపోయిన వెంటనే.. శశికళను పరపనగ్రహారలోని కేంద్ర కారాగారినికి తరలించనున్నారు పోలీసులు. గతంలో జయలలిత, బీఎస్ యడ్యూరప్ప ఉన్న బ్యారక్లోనే శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో బెంగూళరు, కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications