విద్యార్థి ఫోన్ నుంచి మహిళా లెక్చరర్లకు బూతు మెసేజ్లు: అరెస్ట్
మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ ద్వారా నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపించాడు. దీంతో, షాక్కు గురైన సదరు మహిళా లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆ సెల్ ఫోన్ ఓ విద్యార్థిదని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేలింది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications