ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రత..
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మువ్వన్నెల జెండా ఎగురవేస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రాత్మక కట్టడాలు.. త్రివర్ణాలతో మెరిసిపోతున్నాయి. తెలంగాణ సచివాలయం, చార్మినార్, వరంగల్లోని వేయి కాళ్ల మండపం, ఏపీలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, కర్నూలు కొండారెడ్డి బురుజు.. ఇలా అనేక కట్టడాలు కొత్త కళను సంతరించుకున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రాష్ట్రాల్లో భద్రత పెంచారు. ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో నిఘా ఉంచారు. వాహనాలను తనఖీ చేశారు. ఎర్రకోట సమీపంలో వాహనాలను దారి మళ్లించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నొయిడా, ఘజియాబాద్, గుర్గావ్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రాంతాల్లో చెక్ పాయింట్లను నెలకొల్పారు. జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, రింగ్ రోడ్లో వాహనాల రాకపోకలను నియంత్రించారు. వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఢిల్లీ వ్యాప్తంగా 3,000 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరింపజేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications