చంపేస్తా, రాజకీయాలు వదిలెయ్:ఎమ్మెల్యేకి బెదిరింపు
లక్నో: రాజకీయాల నుంచి తప్పుకోకపోతే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే గోరఖ్ పాశ్వాన్ బుధవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బెల్తారా రోడ్డు అసెంబ్లీ నియోజకవర్గానికి అతను ఎమ్మెల్యేగా ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం నాడు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజకీయాలు వదిలేయాలని హెచ్చరించారు. దీంతో ఆయన స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ దృశ్య సమీక్షలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విశాఖ కలెక్టరేట్ నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.