తలాక్ తర్వాత కూడా బిడ్డను పోషించాల్సిందే: సుప్రీంకోర్డు సంచలన తీర్పు!
తలాక్-ఎ-హసన్ పద్ధతిలో విడాకులు పొందిన ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిల్లల హక్కుల పరిరక్షణకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. విడాకుల తర్వాత బిడ్డ పోషణ బాధ్యత, ఇతర అధికారిక పత్రాల విషయంలో తండ్రి సహకరించడం లేదంటూ సదరు ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమై పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం బిడ్డ హక్కుల పరిరక్షణ కోసం తండ్రికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బిడ్డకు సంబంధించిన పాస్పోర్ట్ జారీ, స్కూల్ అడ్మిషన్, బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన అన్ని పత్రాలపై తండ్రి తప్పనిసరిగా సమ్మతి తెలపాలని (సంతకం చేయాలని) కోర్టు ఆదేశించింది. మైనర్ బిడ్డకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ గార్డియన్షిప్ను తండ్రికి బదులుగా తల్లికి అప్పగించాలని బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే బిడ్డ ఆధార్ కార్డు, ఇతర అధికారిక పత్రాలపై తల్లి పేరును గార్డియన్గా అప్డేట్ చేయాలని కూడా ఆదేశించింది.

'సంపాదించి అయినా మెయింటెనెన్స్ ఇవ్వు'
తండ్రి బిడ్డకు మెయింటెనెన్స్ (పోషణ భత్యం) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విడాకులు జరగకపోయినా లేదా బిడ్డ తండ్రి వద్ద ఉన్నా కూడా స్కూల్, బట్టలు, పుస్తకాలు, ఆహారం వంటి అవసరాలకు డబ్బులు ఇవ్వాల్సిందేనని అన్నారు. మహిళ తన కోసం ఏమీ అడగడం లేదని, కేవలం బిడ్డ కోసమే పోషణ భత్యం అడుగుతున్నారని తెలిపారు. తండ్రి ఢిల్లీ కోర్టులో న్యాయవాది అయినప్పటికీ, తన సంపాదన చాలా తక్కువ అని కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి (CJI), "నువ్వు న్యాయవాదివి కదా" అని వ్యాఖ్యానించారు. తండ్రిని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి పంపించాలని, అతడిని ప్యానెల్లో చేర్చాలని, ప్రతి నెలా కనీసం రెండు కేసులైనా ఇవ్వాలని, తద్వారా అతనికి కనీసం రూ.10,000 ఆదాయం వస్తుందని, ఆ డబ్బును నేరుగా బిడ్డ పోషణకు పంపాలని ఆదేశించారు.
బిడ్డ హక్కుకు అత్యంత ప్రాధాన్యం
"బిడ్డకు తండ్రి నుంచి మద్దతు పొందే హక్కు ఉంది. బిడ్డకు తండ్రిపై, దేశంపై హక్కు ఉంది" అని సీజేఐ స్పష్టం చేశారు. విడాకుల తర్వాత గత 36 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, "షరియా చట్టంలో కూడా పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యత లేదా?" అని మహిళ న్యాయవాది ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెడతామని చెప్పిన సీజేఐ.. ముస్లిం మహిళల విడాకుల సమయంలో పోషణ భత్యం, హక్కులకు సంబంధించిన పెద్ద సమస్యపై తాము దృష్టి పెడతామని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని పక్షాలు లిఖితపూర్వక పత్రాలను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications