వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, ఆధార్ లింక్పై సందిగ్ధత
వ్యక్తిగత గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని న్యాయస్థానం తేల్చింది.
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని న్యాయస్థానం తేల్చింది.

వ్యక్తిగత గోప్యతపై 9 మంది జడ్జిల బృందం ఈ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ల ఆధార్ అనుసంధనంపై సందిగ్ధత ఏర్పడింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును తప్పనిసరి చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్పై విచారించేందుకు ఏర్పాటుచేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది.
దీంతో ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. కొద్ది రోజులపాటు వాదోపవాదాలు విన్న విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2న తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని పేర్కొంటూ గురువారం తీర్పు వెల్లడించింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications