వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ మృతి... ఈయన నేతృత్వంలోనే భారత్‌కు ఆ విజయం

|
Google Oneindia TeluguNews

పంచకుల: దేశ విభజన తర్వాత సియాచిన్ భారత్‌కు దక్కడంలో కీలకంగా వ్యవహరించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పీఎన్ హూన్ పంచకులాలో సోమవారం సాయంత్రం 6:30 గంటలకు మృతి చెందినట్లు ఆయన కుమారుడు రానీ హూన్ చెప్పారు.

విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ మేఘ్‌దూత్‌

విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ మేఘ్‌దూత్‌

దేశ విభజన తర్వాత సిక్కు రెజిమెంట్‌లో ఆయన లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ మూన్ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే సియాచిన్ ప్రాంతం కోసం భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగి ఆ ప్రాంతాన్ని భారత్ కైవసం చేసుకుంది. దీనికే ఆపరేషన్ మేఘ్‌దూత్‌ అని పేరు పెట్టారు. ఆపరేషన్ మేఘ్‌దూత్‌కు అప్పట్లో నాయకత్వం వహించారు ప్రేమ్‌నాథ్ హూన్. శ్రీనగర్ బేస్‌లోని 15 కార్ప్స్‌కు కమాండర్‌గా పనిచేసి 1984లో సియాచిన్‌ ప్రాంతం భారత్‌ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.

1965లో పాక్‌పై యుద్ధంలో సేనాధిపతిగా...

1965లో పాక్‌పై యుద్ధంలో సేనాధిపతిగా...

1965లో సేనాధిపతిగా భారత్ చైనా సరిహద్దుల్లో పనిచేశారు. అంతేకాదు పాకిస్తాన్‌పై అదే ఏడాది జరిగిన యుద్ధంలో కూడా ప్రేమ్‌నాథ్ హూన్ ముందుండి నడిపించారు. మిలటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా కూడా సేవలందించారు. తన చివరి శ్వాస వరకు భారత దేశం కోసమే ఆయన కలలు కన్నారని కొనియాడారు వెస్ట్రన్ కమాండ్ మాజీ చీఫ్ రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజే సింగ్. ఆపరేషన్ మేఘ్‌దూత్‌ను వియజవంతంగా నిర్వహించారని చెప్పారు. సియాచిన్ ప్రాంతం భారత్‌కు దక్కడంలో లెఫ్ట్‌నెంటె జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ పాత్ర మరువలేనిదని చెప్పారు. నేటి యువత ఒక మంచి మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజే సింగ్. అంతేకాదు తాను ఒక ఎన్జీఓను కూడా నడిపాడని దీని ద్వారా దేశ సమగ్రతను కాపాడే వారని కేజే సింగ్ చెప్పారు.

 దేశానికి సియాచిన్ అందించిన గొప్ప వీరుడు

దేశానికి సియాచిన్ అందించిన గొప్ప వీరుడు


సియాచిన్ కోసం జరిగిన యుద్ధంలో సరైన ఆయుధాలు, బలగం లేకపోయినప్పటికీ దేశానికి విజయాన్ని అందించడంలో ప్రేమ్‌నాథ్ హూన్ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు మరో రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ ధిల్లాన్. నాడు ప్రేమ్‌నాథ్ దేశానికి సియాచిన్ అందించారని ఇప్పటికీ అది భారత్‌ చేతిలోనే ఉందని కొనియాడారు. తను జీవితంలో దేశానికి సాధించిన అద్భుతమైన విజయం సియాచిన్ అని చెప్పారు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ ధిల్లాన్.

1929లో అబోటాబాద్‌లో జన్మించిన ప్రేమ్‌నాథ్ హూన్

1929లో అబోటాబాద్‌లో జన్మించిన ప్రేమ్‌నాథ్ హూన్

ఇదిలా ఉంటే రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ 1929లో అబోటాబాద్‌లో జన్మించారు. 1947లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడెమీలో చేరారు. తన లక్ష్యం ఏమిటో తనకు తెలుసని దాన్ని సాధించేందుకు నిర్ణయించుకునే ముందుకు వెళ్లి సియాచిన్ ప్రాంతంను కైవసం చేసుకున్నామని గతేడాది జూన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రేమ్‌నాథ్. సియాచిన్ ప్రాంతాన్ని భరతమాతకు బహుమతిగా ఇస్తే అది జీవితాంతం గుర్తుండిపోతుందని భావించి కొంత కష్టమైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించామని చెప్పుకొచ్చారు ప్రేమ్‌నాథ్.

English summary
Lt Gen Prem Nath Hoon dies, Operation Meghdoot under Prem Nath Hoon, Siachen victory 1984, Prem Nath Hoon led siachen war,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X