రగులుతోంది మొగలిపొద: నడుం నాజూకుగా ఉందని గిల్లిన ఎస్ఐ.. ఆ తర్వాత..!
బెంగళూరు/న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కామాంధుడు అని తెలిసింది. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటున్న స్నేహితుల కేసులో పోలీసుల ముందు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఓ మహిళ వెళ్లింది. అంతే పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా ఆలోచించకుండా ఆ మహిళ నడుం చూసి రగిలిపోయిన ఎస్ఐ ఆమె నడుం మీద చేతులు వేసి గిల్లేశాడు.
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దంపతులు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడానికి బెంగళూరలో నివాసం ఉంటున్న మహిళ సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సుద్దగంటపాళ్య పోలీస్ స్టేషన్ లో మంజునాథ్ అనే వ్యక్తి ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు.
విడాకుల కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన మహిళ అందచందాలు చూసి ఎస్ఐ మంజునాథ్ జోల్లు కార్చుకున్నాడు. మల్లెపువ్వు తీగలాంటి సన్నటి ఆమె నడుం చూసిన ఎస్ఐ మంజునాథ్ కామంతో తట్టుకోలేకపోయాడు. ఎర్రగా, పొడవుగా, నాజుకుగా ఉన్న మహిళను చూసిన ఎస్ఐ మంజునాథ్ అతని కుర్చిలో నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లాడు.

మహిళ దగ్గర స్టేట్ మెంట్ తీసుకోకుండా మొదట ఆమె నడుం మీద చేతులు వేసి ఆమె నడుం గిల్లేశాడు. మహిళ శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ మంజునాథ్ ఇప్పుడు ఎలా ఉందో చెప్పు అంటూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎస్ఐ చేష్టలతో విసిగిపోయిన మహిళ పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది.
అర్దరాత్రి మహిళ వాట్సాప్ నెంబర్ కు అసభ్యంగా మెసేజ్ లు పంపించిన ఎస్ఐ మంజునాథ్ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని తెలిసింది. ఎస్ఐ మంజునాథ్ తీరుతో విసిగిపోయిన మహిళ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ట్విట్టర్ అకౌంట్ లో జరిగిన మ్యాటర్ మొత్తం వివరించి పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.
ఈ విషయంలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యి ఏసీపీ ర్యాంక్ అధికారితో విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని బాధితురాలికి సూచించారు. బుధవారం సాయంత్రం బాధితురాలు సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ మంజునాథ్ మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు పెట్టింది.

పోలీసు అధికారుల విచారణలో ఎస్ఐ మంజునాథ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసు కమీనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐని సస్పెండ్ చేశామని డీసీపీ సీకే బాబా గురువారం మీడియాకు చెప్పారు. ఎస్ఐ మంజునాథ్ ను ఇంటికి పంపించిన బెంగళూరు పోలీసు అధికారులు మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలతో ఎస్ఐ మంజునాథ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications