షాకింగ్: "షర్బత్'లో టాయిలెట్ నీళ్లు, దాహం వేస్తుందని తాగితే?
Recommended Video

అహ్మదాబాద్: ఇలాంటి విషయాలు తెలిస్తే.. బయట ఏదైనా తినాలన్నా.. తాగాలన్నా ఢోకు వచ్చినంత పనవడం ఖాయం. ఆకలి దంచేస్తుందనో.. బాగా దాహం వేస్తుందనో.. ఎక్కడ పడితే అక్కడ తినడం, తాగడం చేస్తే.. ఆ తర్వాత ఇలాంటి నిజాలు తెలుసుకుని బాధపడాల్సిందే.
ఇంతకీ విషయమేంటంటే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కాలూపూర్ పంచకువ ప్రాంతంలో ఓ వ్యక్తి నిమ్మకాయ సోడా అమ్ముతుంటాడు. ఇటీవల ఓరోజు అతని వద్ద ఉన్న నీళ్లు అయిపోవడంతో.. దగ్గరలోని 'పబ్లిక్ టాయిలెట్స్' వద్దకు వెళ్లాడు.

'పబ్లిక్ టాయిలెట్స్' లోపలి నుంచి ఓ పైప్ తీసుకొచ్చి ఖాళీ అయిన స్టీల్ డ్రమ్మును నింపుకున్నాడు. ఆ సమయంలో ఎవరు ఫోటో తీశారో గానీ దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఎండాకాలం దాహం తీర్చుకోవడానికి చాలామంది నిమ్మకాయ సోడా తాగడం కామన్. ఇప్పుడిలాంటి సంఘటనలు వెలుగుచూడటంతో.. బయట ఏదైనా తాగాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు.
ఇదిలా ఉంటే, మరుగుదొడ్డి నీళ్లతో షర్బత్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యవహారాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications