మానస సరోవర్లో చిక్కుకొన్న యాత్రికులు .. కాపాడాలని విన్నపాలు ...
హైదరాబాద్ : విహారం కోసం తీర్థయాత్ర వెళితే .. అక్కడే చిక్కుకొన్నారు. నర మానవుడు లేని చోట పడరాని పాట్లు పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్పించాలని కోరుతున్నారు. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని విన్నవించారు. తమను తీసుకొచ్చినా సదరన్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు ఓ వీడియో పంపించారు పర్యాటకులు
సరోవర్ యాత్ర ..
తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది మానస సరోవర్ యాత్రకు వెల్లారు. వారు వెళ్లి దాదాపు 11 రోజులు అవుతుంది. అయితే వారు చైనా-నేపాల్ సరిహద్దులో చిక్కుకొన్నారు. మానస సరోవర్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు తమ కుటుంబసభ్యులకు వీడియో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారంతా ఐదురోజుల నుంచి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఐదురోజుల నుంచి శీతలగాలులతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. తమకు సహాయ చర్యలు చేయాలని విన్నవించారు. కొందరు ఇప్పటికే అనారోగ్యానికి గురయ్యారని వివరించారు.

పట్టించుకోవడం లేదు ...
అయితే తమను తీసుకొచ్చినా సదరన్ ట్రావెల్స్ సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు. తాము చిక్కుకొన్న .. కనీసం సహాయ చర్యలు చేపట్టేందుకు ముందుకురాలేదని నిట్టూర్చారు. వెంటనే తమ వద్దకు ప్రతినిధులు పంపాలని సూచించారు. స్వస్థలాలకు పంపేందుకు సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో .. శీతల గాలులకు రాష్ట్రానికి చెందిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారికి వెంటనే ఆపన్నహస్తం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications