ఎఫైర్ లో మునిగిపోయిన భార్య .. పిల్లలకు విషమిచ్చి.. భర్త సూసైడ్..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు అధికంగా జరుగుతున్నాయి. భర్తలను చంపేస్తున్న భార్యలు.. లేదా ఎఫైర్ లో మునిగిపోతున్న భార్యలు.. ఇప్పుడో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ప్రియుడిని మర్చిపోలేకే భార్యలు ఈ పనులు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్నవాళ్లూ అధికంగానే ఉంటున్నారు. అయితే కొందరు మాత్రం ఏకంగా భర్తలకే స్పాట్ పెడుతున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లంటేనే యువత పారిపోతోంది.
తాజాగా గుజరాత్లోని సూరత్ నగరంలో విషాద ఘటన జరిగింది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ఆ భర్త మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఆ భర్త తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు అంతేకాక తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తిని అల్పేష్ కాంతిభాయ్ సోలంకి గా గుర్తించారు. గుజరాత్ సూరత్ లోని దిండోలి నగరంలో అల్పేష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇక ఆయన భార్య ఫాల్గుణి భాయ్.. జిల్లా కార్యాలయంలో క్లర్క్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఫాల్గుని భాయ్.. వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. దీంతో అల్పేష్ మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో ఇంట్లో భార్య లేని సమయంలో ఇంట్లో తలుపులు పెట్టి పిల్లలకు విషం ఇచ్చి తర్వాత తాను విషం తీసుకుని చనిపోయాడు. అయితే అల్పేష్ కు ఆయన భార్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఇంటికి వచ్చి చూసింది. ఆ సమయంలో ఇంటి తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉంది. దీంతో బంధువులు వచ్చి.. తలుపులు పగలగొట్టారు. ఈ ఘటనపై అల్పేష్ భాయ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడి భార్య ఫాల్గుణి భాయ్ కు నరేష్ కుమార్ రాథోడ్ అనే వ్యక్తితో సంబంధం ఉందన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications