ఫోర్జరీ పనులు చేస్తే నా తడాఖా చూపిస్తా: సీఎంకు దినకరన్ వార్నింగ్, ఎమ్మెల్యేలు జంప్ !
ప్రజలకు సేవ చెయ్యకుండా పదవీవ్యామోహంతో స్వార్థం కోసం అన్నాడీఎంకే పార్టీని కబళించే ప్రయత్నాల కోసం ఫోర్జరీ పనులు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తగిన బుద్ది చెబుతానని తమిళనాడు ముఖ్యమంత్రి .
మదురై: ప్రజలకు సేవ చెయ్యకుండా పదవీవ్యామోహంతో స్వార్థం కోసం అన్నాడీఎంకే పార్టీని కబళించే ప్రయత్నాల కోసం ఫోర్జరీ పనులు చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, తగిన బుద్ది చెబుతానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ హెచ్చరించారు.
మదురై సమీపంలోని మేలూరులో సోమవారం రాత్రి దినకరన్ వర్గీయులు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీటీవీ దినకరన్ ఉద్వేగంగా ప్రసగించారు.

అన్నాడీఎంకేలోని చీలక వర్గాలను ఒక్కటి చేసి రెండాకుల చిహ్నం సంపాధించి పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చే బాధ్యత తన మీద ఉందని దినకరన్ అన్నారు. జయలలిత మరణించిన రోజు శశికళ అనుకుని ఉంటే కచ్చితంగా అదే రోజు సీఎం అయ్యేవారని టీటీవీ దినకరన్ చెప్పారు.
త్యాగశీలి అయిన శశికళ ఆరోజు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేశారని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. శశికళ జైలుకు వెలుతూ పార్టీని కంటికి రెప్పలా కాపాడాలని తన దగ్గర మాట తీసుకుని వెళ్లారని, అయితే నన్నే కొందరు పార్టీకి దూరం చెయ్యాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని పరోక్షంగా ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని విమర్శించారు.
తాను తలుచుకుంటే తన సత్తా చూపిస్తానని, అయితే జయలలిత అధికారంలోకి తీసుకు వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తాను కూల్చనని దినకరన్ చెప్పారు. దినకరన్ బహిరంగ సభకు అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు హాజరైనారు.
అయితే సోమవారం ఉదయం వరకు దినకరన్ వెంట 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు చిన్నగా జారుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ ఇలాగే దినకరన్ గ్రూప్ నుంచి చిన్నగా జారుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications