మళ్లీ తెగబడ్డ పాక్: సరిహద్దు వెంబడి కాల్పులు, ఇద్దరు మృతి!
పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో కాల్పులకు దిగినట్టు ఒక అధికార ప్రకటన తెలిపింది. భారత సైన్యం పాక్ కాల్పులను ప్రతిఘటిస్తోందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటనలో పేర్కొ
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ యథేచ్చగా ఉల్లంఘిస్తూనే ఉంది. వరుసగా మూడో రోజు పాక్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పాక్ చేసిన ఈ దుశ్చర్యను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.
నౌషెరా సెక్టార్లోని రాజౌరి వద్ద పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది. ఉదయం 7.15 గంటలకు చోటు చేసుకున్న ఈ కాల్పుల్లో.. పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో కాల్పులకు దిగినట్టు ఒక అధికార ప్రకటన తెలిపింది. భారత సైన్యం పాక్ కాల్పులను ప్రతిఘటిస్తోందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. కాగా, గత గురువారం కూడా నౌషెరా సెక్టార్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు దిగడంతో.. భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరితో పాటు ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయపడ్డాడు. పాక్ వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో నౌషెరా సరిహద్దు వెంబడి గ్రామాల ప్రజలు వేరే చోటికి తరలిపోతున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications