కిరణ్ రిజిజు వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు: కేంద్రమంత్రి సురక్షితం (వీడియో)
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంబన్ జిల్లా బనిహల్ ప్రాంతంలో ఆయన కారును ఓ ట్రక్క బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ఘటన నుంచి మంత్రి కిరణ్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Going from Jammu to Udhampur in Jammu & Kashmir to attend Legal Services Camp. Many beneficiaries of the Central Govt Schemes are attending the function along with Judges and NALSA team. Now, one can enjoy the beautiful road throughout the journey. pic.twitter.com/5yg43aJX1C
— Kiren Rijiju (@KirenRijiju) April 8, 2023
ఉధంపూర్ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు రిజిజు వాహనాన్ని ఢీకొట్టిందని అదనపు డీజీ ముకేశ్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపు వేగంతో మంత్రి కారు వద్దకు చేరుకున్నారు. కారు డోర్లు తీసి మంత్రిని బయటకు తీసుకొచ్చారు.

ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్ వెళ్లిన కిరణ్ రిజిజు(Kiren rijiju) ఉధంపూర్ వరకు కారులో ప్రయాణించారు. ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు అంటూ విశాలమైన రహదారిని చూపిస్తూ తీసిని వీడియోను ట్విట్టర్ వేదికగా శనివారం ఉదయం ఆయన పంచుకున్నారు. అటల్ టన్నెల్ నుంచి ప్రయాణించిన వీడియోను కూడా పోస్టు చేశారు.
This was scary... Good to know @KirenRijiju is safe. Serious concerns over his Security arrangments, how could Pilot car not stop the truckpic.twitter.com/1hyPJBPcCJ
— Mihir Jha (@MihirkJha) April 8, 2023
అంతకుముందు, కేంద్రమంత్రి రిజిజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించారు. రాహుల్ రాజకీయంగా విఫలమయ్యారని, తన రాజకీయ జీవితాన్ని పెంచడానికి ఉద్దేశపూర్వకంగా అదానీ సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని రిజిజు ఆరోపిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రభుత్వం మౌనంగా ఉండదని హెచ్చరించారు. హిండెన్బర్గ్-అదానీ సమస్యపై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ జరుపుతున్నందున రిజిజు దానిపై వ్యాఖ్యానించలేదు.
Going through Dr. Shyama Prasad Mukherjee Tunnel on the way up to Srinagar from Udhampur. A massive construction for improvement of the highway is going on just like in all other parts of India. pic.twitter.com/ICcyFCA1rI
— Kiren Rijiju (@KirenRijiju) April 8, 2023
అయితే, వివాదాలను ఎత్తిచూపేందుకు, గాంధీజీ కెరీర్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ కావాలనే దీనిని సమస్యగా మార్చుకుందని ఆరోపించారు కిరణ్ రిజిజు. డోగ్రీ భాషలో భారత రాజ్యాంగం మొట్టమొదటి ఎడిషన్ను ప్రారంభించేందుకు రిజిజు జమ్మూలో పర్యటించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే ప్రభుత్వం మౌనం వహించదని హెచ్చరించారు కేంద్రమంత్రి.
ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని.. గాంధీకి సంబంధం ఉన్న రాజవంశ రాజకీయాల భావన అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనను రిజిజు పునరుద్ఘాటించారు. అదానీ గ్రూప్ కుంభకోణంలో లింక్ చేయడంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications