రేప్ను అడ్డుకుందని మహిళకు నిప్పుపెట్టిన పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళల ప్రాణ, మానలకు రక్షణగా నిలువాల్సిన పోలీసులే.. ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెకు నిప్పుపెట్టారు. ఈ ఘటన బారాబంకి జిల్లాలో జరిగింది
పోలీసుల కథనం ప్రకారం.. అక్కడ పోలీసు శాఖలో పని చేస్తున్న యాదవ్, అఖిలేష్లు ఓ కేసులో అరెస్టయిన తన భర్తను కలిసేందుకు వచ్చిన బాధితురాలిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications