వందే మాతరం గీతంపై కేంద్రం సంచలనం.. ఇకపై ఇదే..!!
నరనరాల్లో దేశభక్తిని ఉప్పొంగింపజేసే వందే మాతరం గీతంపై కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. సరైన మర్యాదను పాటిస్తూ గౌరవం ఇచ్చేలా మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ గీతానికి సంబంధించిన అధికారిక వర్షన్ ఆలపించేటప్పుడు గానీ, వినిపించేటప్పుడు గానీ ఇకపై లేచి నిల్చోవడం తప్పనిసరి. శ్రోతలు అటెన్షన్లో లేచి నిల్చోవాలి. సామూహిక గీతాలాపనతో పాటు దీని పఠనం తప్పకుండా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశించింది.
సినిమా హాళ్లలో న్యూస్రీల్స్ లేదా డాక్యుమెంటరీల సమయంలో ఇది ప్లే అయితే నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే వందేమాతరంతో పాటు జనగణమన అధినాయక జయహే.. జాతీయ గీతం రెండింటినీ పాడాల్సి వచ్చిన సందర్భంలో అనుసరించాల్సిన విధి విధానాలు కూడా ఇందులో ఉన్నాయి. జనగణమన కంటే వందేమాతరాన్ని ముందుగా ఆలపించడం తప్పనిసరి అని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.

1937లో తొలగించిన నాలుగు చరణాలతో సహా వందేమాతరం ఆరు చరణాలనూ కూడా పూర్తిగా ఆలపించాల్సి ఉంటుంది ఇకపై. అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం వేడుకలతో పాటు రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాలలోనూ వందేమాతరం గీతాన్ని పూర్తిగా వినిపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి రాక, నిష్క్రమణ వేళలు పాఠశాలల్లో విద్యార్థులలో జాతీయ గేయం, వందేమాతరం గీతం, జెండా పట్ల గౌరవం పెంపొందించే ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాల్లో పొందుపర్చారు.
'వందేమాతరం' గీతానికి అధిక ప్రాచుర్యం కల్పించే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు అన్ని అధికారిక కార్యక్రమాలలో కూడా ఆరు చరణాలతో 3:10 సెకన్ల నిడివి కలిగిన ఈ గీతాన్ని పాడటం లేదా అధికారిక వర్షన్ ను ప్లే చేయడం తప్పనిసరి. త్రివర్ణ పతాకావిష్కరణలు, రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు అలాగే ఆయన ప్రసంగాలు, దేశీయ ఉపన్యాసాల వంటివి.. ఈ అధికారిక కార్యక్రమాల్లో ఉన్నాయి.
ఆయన రచించిన 1882 నాటి 'ఆనందమఠ్' నవలలో ఇది ప్రచురితమైంది. స్వాతంత్య్రానంతరం 1950లో గేయం మొదటి రెండు చరణాలను భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించారు. జనగణమన అధినాయక జయహే మాదిరిగా కాకుండా, వందేమాతరం ఆలపించడానికి ఇంతవరకు నిర్దిష్ట ప్రొటోకాల్ లేదనే విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ప్రస్తుత మార్గదర్శకాలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications