విహెచ్పి నేత అశోక్ సింఘాల్ ఆరోగ్యం విషమం
అయోధ్య: విశ్వహిందూ పరిషత్ కీలక నేత అశోక్ సింఘాల్ ఆరోగ్యం మరింత విషమించింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన శనివారం గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉందనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారని వీహెచ్పీ వర్గాలు వెల్లడించాయి.
89ఏళ్ల సింఘాల్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అక్టోబరు 20న ఇదే ఆస్పత్రిలో చేరి మూడ్రోజుల కిందే ఇంటికొచ్చారు.
సింఘాల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతున్నదని మేదాంత ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే దూబే అన్నారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

హిమాచల్ సీఎంపై మనీలాండరింగ్ కేసు
ఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత సెప్టెంబరులో సింగ్పై సీబీఐ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది.
2009-11 మధ్యకాలంలో సింగ్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.6.1 కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సింగ్, అతడి భార్య ప్రతిభాసింగ్, ఎల్ఐసీ ఏజెంట్ ఆనంద్చౌహాన్, అతడి సోదరుడు సీఎల్ చౌహాన్ ఉన్నారు.
సింగ్ 2009లో జీవితబీమాలో రూ.6.1 కోట్లు మదుపు చేశారని, ఈ డబ్బంతా వ్యవసాయం నుంచి వచ్చినట్లు సింగ్ చెప్పారని సీబీఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధం చేసేందుకు 2012లో ఆయన ప్రయత్నించారని వెల్లడించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications