విలేకరులపై ఉమ్మేసిన విజయ్ కాంత్ (వీడియో)
చెన్నై: డీఎండీకే చీఫ్ క్యాప్టెన్ విజయ్ కాంత్ మీడియాపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. విజయ్ కాంత్ తీరుపట్ల చెన్నై ప్రెస్ క్లబ్ తో పాటు పలు మీడియా సంఘాలు మండి పడుతున్నాయి.
ఓ పార్టీ చీఫ్, ప్రజాప్రతినిధి అయిన విజయ్ కాంత్ పబ్లిక్ గా మీడియా సభ్యుల మీద ఉమ్మేసి తీవ్ర చర్చకు దారి తీశారు. ఆదివారం విజయ్ కాంత్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంలో ఓ విలేకరి 2016లో జరిగే ఎన్నికల్లో జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.
ఆ సమయంలో విజయ్ కాంత్ సావధానంగానే బదులిచ్చారు. అన్నా డీఎంకే మళ్లీ అధికారం చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తరువాత రెండు మూడు ప్రశ్నలకు జవాబిచ్చారు. అంతలోనే విజయ్ కాంత్ కు పూనకం వచ్చింది.
మీడియా సభ్యుల మీద విరుచుకుపడ్డారు. మీకు జయలలితను ప్రశ్నించే దమ్ము ఉందా అని మీడియా సభ్యులను నిలదీశారు. మీకు భయం, మీరు జర్నలిస్టులేనా అంటూ వారి మీద ఉమ్మేశారు. ఈ విషయంపై విజయ్ కాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మీడియా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications