Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియుడితో రాసలీలలు, రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్న భర్త, ఏమైందంటే?

చెన్నై: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తిని భర్త, బావమరిది కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఆశోక్‌నగర్ 83 వీధిలో మురళి, శోభన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. మురళి ఆటో నడుపుతుంటారు. అయితే మురళి భార్య ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్ళేది

ఈ వాకింగ్ సమయంలోనే విశ్వనాథన్ అనే వ్యక్తి శోభనకు పరిచయమయ్యాడు ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ వివాహేతర సంబంధం విషయం భర్త మురళికి తెలిసింది.

వాకింగ్‌ కోసమని ప్రియుడితో రాసలీలలు

వాకింగ్‌ కోసమని ప్రియుడితో రాసలీలలు

శోభన ప్రతి రోజూ వాకింగ్ కోసమని వస్తూ ప్రియుడితో రాసలీలలు సాగించేదని భర్త మురళి గుర్తించాడు. దీంతో భార్య శోభన మాత్రం ప్రియుడితో రాసలీలను మాత్రం ఆపలేదు. ఈ విషయమై తన బావ మరిదికి శోభన విషయాన్ని చెప్పాడు మురళి. అంతేకాదు భార్యతో ఈ విషయమై మురళి తరచూ గొడవపడేవాడు.

విశ్వనాధన్‌తో వివాహేతర సంబంధం

విశ్వనాధన్‌తో వివాహేతర సంబంధం

శోభన ప్రతిరోజూ ఉదయం నందంబాక్కం వరకూ వాకింగ్‌కు వెళుతుంటుంది. కేకేనగర్‌ 16వ అవెన్యూకు చెందిన విశ్వనాథన్‌ కూడ అదే ప్రాంతానికి వాకింగ్‌కు వస్తుంటారు. వాకింగ్‌లో వీరిద్దరూ పరిచయమయ్యారు. అనతికాలంలోనే ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సన్నిహితుల ద్వారా ఈ విషయం మురళీకి చేరింది.

ప్లాన్ ప్రకారం విశ్వనాథన్ చంపేశారు

ప్లాన్ ప్రకారం విశ్వనాథన్ చంపేశారు

ప్రతి రోజూ మాదిరిగానే శోభన వాకింగ్ కు వెళ్ళింది. విశ్వనాథ‌న్ కూడ వాకింగ్ కు బుదవారం వచ్చాడు. అయితే వీరిని మురళి అతని బావమరిది కన్నన్ రహస్యంగా వెంబడించారు.బర్మా కాలనీ సమీపంలోని మైదానంలో చెట్ల పొదల మాటుకు శోభన, విశ్వనాథన్ వెళ్ళగానే మురళి, కన్నన్ వారిని అనుసరించి కర్రలతో ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడిలో విశ్వనాథన్ అక్కడి కక్కడే చనిపోయాడు. శోభన తీవ్రంగా గాయపడింది.

Recommended Video

    Illegal Affair made Man attempts to kill woman in Kakinada అక్రమ సంబంధం వల్ల - Oneindia Telugu
    పోలీసులకు లొంగుబాటు

    పోలీసులకు లొంగుబాటు

    శోభన, విశ్వనాథన్‌లపై దాడి చేసిన తర్వాత నిందితులు మురళి, కన్నన్‌లో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులకు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలం వద్దకు చేరుకొన్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న విశ్వనాథన్, శోభనను గుర్తించారు. అప్పటికే విశ్వనాథన్ చనిపోయారని గుర్తించారు. శోభన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+