ఫార్వార్డ్ మెసేజ్లపై పరిమితి విధించిన వాట్సాప్: నేటి నుంచే అమల్లోకి
Recommended Video
న్యూఢిల్లీ: తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వ్యాప్తి కాకుండా కట్టడి చేసేందుకు ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో వాట్సాప్లో వస్తున్న వదంతుల వ్యాప్తి కారణంగా అమాయకులపై దాడులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ
నేపథ్యంలో
కేంద్రం
ప్రభుత్వం
కూడా
వాట్సాప్ను
తగు
చర్యలు
తీసుకోవాలని
ఆదేశించింది.
దీంతో
తప్పుడు
వార్తలను
అరికట్టేందుకు
వాట్సాప్..
ఫార్వర్డ్
చేసే
సందేశాలపై
పరిమితి
విధించింది.
ఇందులో
భాగంగానే
ఇక
నుంచి
వాట్సాప్
మెసేజ్లు
ఐదుగురికి
మాత్రమే
ఫార్వర్డ్
చేసుకునేందుకు
అవకాశం
ఉంటుంది.
బుధవారం(ఆగస్టు
8)
నుంచి
భారత్లో
వాట్సాప్
వినియోగదారులకు
ఇది
వర్తించనుందని
వాట్సాప్
ఓ
ప్రకటన
ద్వారా
వెల్లడించింది.
దీంతో పాటు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి అనే దాన్ని వాట్సాప్ ఆ వీడియోలో వివరించింది. ఇటువంటి వార్తలు నమ్మకుండా ప్రజల్లో ఎలా చైతన్యం తీసుకురావాలనే దాని గురించి ప్రస్తావించింది. ఎటువంటి సమయంలో ఫార్వర్డ్ సందేశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేసింది.
ఇప్పటి వరకు దాదాపు 20 మంది వ్యక్తులకు లేదా గ్రూపులకు ఒకేసారి ఫార్వర్డ్ మేసేజ్ను పంపించేందుకు సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని భారత్లో ఐదుకు మాత్రమే చేర్చింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతను తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, అలాగే వాట్సాప్లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తామని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.