నక్సలైట్ దాడి: సీఆర్పీఎఫ్కు చీఫ్ లేకపోవడం గట్టి దెబ్బ
చత్తీస్గఢ్లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరవై ఆరు మంది జవాన్లను కోల్పోయాం.
రాయపూర్: చత్తీస్గఢ్లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరవై ఆరు మంది జవాన్లను కోల్పోయాం. అయితే, కొత్త సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ అపాయింటుమెంట్ పైన ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
గత రెండు నెలలుగా సీఆర్పీఎఫ్ జవాన్లకు హెడ్ లేరు. త్వరలో కొత్త డైరెక్టర్ జనరల్ను నియమిస్తామని హోం మినిస్టర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటన మాత్రం లేదని సీఆర్పీఎఫ్ అఫీషియల్స్ చెబుతున్నాయి.

సీఆర్పీఎఫ్కు చీఫ్ లేకపోవడం వల్ల గత రెండు నెలల్లోనే రెండు మేజర్ దాడులను సీఆర్పీఎఫ్ చవి చూసింది. ఇందులో పలువురు జవాన్లను కోల్పోయాం.
కే దుర్గా ప్రసాద్ రిటైర్ అయిన తర్వాత సీఆర్పీఎఫ్కు చీఫ్ లేకుండా పోయారు. సందీప్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖ సరైన చీఫ్ కోసం చూస్తోంది. ఓ ఐపీఎస్ ఫ్యానల్తో లిస్ట్ తయారు చేశారు. కానీ ఇంకా తుది నిర్ణయం కాలేదు. చీఫ్ లేకపోవడంతో సీఆర్పీఎఫ్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.












Click it and Unblock the Notifications