వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: అర్దరాత్రి రైల్వేస్టేషన్ లో యువకుడు ?, పోలీసులు ఎంట్రీ, నా భార్యను చంపేసి చెక్కేస్తున్నానని చెప్పి !

|
Google Oneindia TeluguNews

ముంబాయి: భార్యతో కలిసి కాపురం చేస్తున్న భర్త కొంతకాలం సంతోషంగా ఉన్నాడు. భార్యను పదేపదే చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త ఆమెతో ఎక్కువగా గొడవపడేవాడు. దంపతుల మద్య రాజీ చెయ్యాలని కుటుంబ సభ్యులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే నేను మోనార్క్ నేను ఎవ్వరి మాట వినను అని భర్త రెచ్చిపోవడం మొదలు పెట్టాడు. ఇప్పటికే భార్య దెబ్బతో జైలుకు వెళ్లిన భర్త బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన భర్త మళ్లీ అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. అర్దరాత్రి రైల్వేస్టేషన్ లో ఓ రైలు ఎక్కిన భర్త అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని రైల్వే పోలీసులు గమనించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేసి షాక్ అయ్యారు. కొన్ని గంటల ముందు తన భార్యను గొంతు కోసి చంపేశానని ఆ వ్యక్తి చెప్పడంతో రైల్వే పోలీసులు హడలిపోయారు.

Illegal affair: షాపు చూసుకోమని భర్తకు చెప్పిన ప్రియుడు, ఇంట్లో ఫ్రెండ్ భార్యతోనే ?, ఇద్దరూ ఫినిష్ !Illegal affair: షాపు చూసుకోమని భర్తకు చెప్పిన ప్రియుడు, ఇంట్లో ఫ్రెండ్ భార్యతోనే ?, ఇద్దరూ ఫినిష్ !

మైనర్ తో పెళ్లి

మైనర్ తో పెళ్లి


ముంబాయిలోని అంధేరిలోని డీఎన్ నగర్ లో హాసన్ పఠాన్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అత్తరున్నిసా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని హాసన్ పఠాన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొత్తలో హాసన్ పఠాన్ అతని భార్యతో కలిసి కాపురం చేస్తూ కొంతకాలం సంతోషంగా ఉన్నాడు.

 రెచ్చిపోయిన మొగుడు

రెచ్చిపోయిన మొగుడు


రానురాను హాసన్ పఠాన్ అతని భార్యను పదేపదే చిత్రహింసలకు గురి చేశాడు, హాసన్ పఠాన్, అత్తరున్నిసా దంపతుల ఎక్కువగా గొడవు జరిగాయి. హాసన్ పఠాన్ దంపతుల మద్య రాజీ చెయ్యాలని కుటుంబ సభ్యులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే నేను మోనార్క్ నేను ఎవ్వరి మాట వినను అని హాసన్ పఠాన్ ఇంకా ఇంకా రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

జైలుకు పంపించిన పోలీసులు

జైలుకు పంపించిన పోలీసులు

హాసన్ పఠాన్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని భార్య కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. మైనర్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెను హాసన్ పఠాన్ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే భార్య దెబ్బతో జైలుకు వెళ్లిన హాసన్ పఠాన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన హాసన్ పఠాన్ మళ్లీ అతని భార్యతో కలిసి ఉంటున్నాడు. హాసన్ పఠాన్ భార్యకు ఇప్పుడు 20 ఏళ్లు.

 అర్దరాత్రి రైలులో చిక్కిపోయాడు

అర్దరాత్రి రైలులో చిక్కిపోయాడు

ముంబాయిలోని మానససరోవర్ రైల్వేస్టేషన్ లో అర్దరాత్రి పన్వేల్ రైలు ఎక్కిన హాసన్ పఠాన్ లగేజ్ కంపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కొంతసేపటి తరువాత హాసన్ పఠాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేశారు. కొన్ని గంటల ముందు ఇంట్లో తన భార్యను గొంతు కోసి చంపేశానని హాసన్ పఠాన్ చెప్పడంతో రైల్వే పోలీసులు హడలిపోయారు. చాలా కాలంగా హాసన్ పఠాన్ అతని భార్యతో గొడవలు పడుతున్నాడని, పదేపదే ఆమెను చంపేస్తానని బెదిరించేవాడని, చివరికి నిజంగానే భార్యను దారుణంగా చంపేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు.

భార్యతో తేడాలు వచ్చాయని చంపేశాడు

భార్యతో తేడాలు వచ్చాయని చంపేశాడు

హాసన్ పఠాన్ ఇచ్చిన సమాచారం మేరకు అంధేరిలోని డీఎన్ నగర్ లోని అతని ఇంట్లో అతని భార్య శవాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు. భార్యతో తేడాలు రావడంతోనే ఆమెను చంపేశానని హాసన్ పఠాన్ అంగీకరించాడని నేవి ముంబాయి పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Wife: The man confessed that he was escaping after killing his wife at their slum dwelling in DN Nagar, Andheri in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X