Wife: రాత్రి భర్త నిద్రపోయిన వెంటనే భార్య ?, వార్నింగ్, భర్త మర్మాంగం కోసేసిన భార్య !
జైపూర్/ రాజస్థాన్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉన్నారు. దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి ఇంటికి వెలుతున్న భర్త భోజనం చేసి నిద్రపోతున్నాడు. భర్త నిద్రపోయిన తరువాత భార్య ఫోన్ తీసుకుని గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వు ఫోన్ లో ఎక్కువగా మాట్లాడకూడదని భర్త అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. రాత్రి భర్త ఇంట్లో నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత భార్య బ్లేడ్ తీసుకుని ఆమె భర్త మర్మాంగం కోసేయడం కలకలం రేపింది.
Wife: ప్రియుడితో మంచి రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీ, తప్పించుకున్న ప్రియుడు ఏ గోడ దూకాడంటే ?
ఫ్యామిలీ సెట్ చేసిన పెళ్లి
రాజస్థాన్ లోని బర్మేర్ జిల్లాలోని ధోరిమన్నే పోలీస్ స్టేషన్ పరిధిలోని బలిసర్ గ్రామంలో గోమరమ్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత సంవత్సరం కుటుంబ సభ్యులు చూపించినప కన్నాదేవి అలియాస్ దేవి (20) అనే యువతిని గోమారమ్ చాలా సంతోషంగా వివాహం చేసుకున్నాడు.
భార్య ఫోన్ కు అంకితం
వ్యవసాయం చేస్తున్న గోమారమ్ అతని భార్య దేవితో కలిసి వేరుగా నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు వ్యవసాయం చేయిస్తూ పొలం దగ్గర కష్టపడుతున్న గోమారమ్ అలసిపోయి రాత్రి ఇంటికి చేరుకుని భోజనం చేసి నిద్రపోతున్నాడు. భర్త గోమారమ్ నిద్రపోయిన తరువాత అతని భార్య దేవి ఫోన్ తీసుకుని కొందరితో గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టింది.
భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త
నువ్వు ఫోన్ లో ఎక్కువగా మాట్లాడకూడదని, తనకు నిద్రపట్టడం లేదని, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావని, పగలు అంతా నీకు టైమ్ లేదా అంటూ గోమారామ్ అతని భార్య దేవి మీద మండిపడ్డాడు.రాత్రిపూట ఇంకోసారి ఫోన్ లో మాట్లాడితే నీకథ చూస్తానని గోమారామ్ అతని భార్య దేవికి వార్నింగ్ ఇచ్చాడు.
భర్త మర్మాంగం కోసేసిన భార్య
తన భర్తకు బుద్ది చెప్పాలని అనుకున్న దేవి ఆమె భర్త గోమారామ్ నిద్రపోతున్న సమయంలో బ్లేడ్ తీసుకుని అతని మర్మాంగం కోసేసింది. మర్మాంగం తెగిపోవడంతో గోమారామ్ ఆసుపత్రిలో చేరాడు. ఈనెల 1వ తేదీన ఈ సంఘటన జరిగింది. గురువారం గోమారామ్ కోలుకుని అతని భార్య దేవి మీద ఫిర్యాదు చేశాడు.
కుయ్యోమర్రో అంటున్న మొగుడు
భార్య దేవి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, ఆమె తనను తన భర్త గోమారామ్ టార్చర్ పెడుతున్నాడని కొన్ని నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసిందని బర్మేర్ జిల్లా అసిస్టెంట్ ఎస్సీ నర్వత్ సింగ్ జైత్వాన్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఫోన్ లో మాట్లాడకూడదని భార్యకు చెప్పడంతో రగిలిపోయిన భార్య ఆమె భర్త మర్మాంగం కోసేయడం కలకలం రేపింది.