పాక్ పైశాచికం: కులభూషణ్ జాదవ్ మృతదేహాన్ని పంపిస్తామంటూ మెసేజ్
పాకిస్థాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) అధికారిక వెబ్సైట్ హ్యాక్ చేసింది. ‘జీరో కూల్’ అనే పేరుతో వెబ్సైట్ను హ్యాక్ చేసి..
న్యూల్లీ: పాకిస్థాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) అధికారిక వెబ్సైట్ హ్యాక్ చేసింది. 'జీరో కూల్' అనే పేరుతో వెబ్సైట్ను హ్యాక్ చేసి.. భారత్ను రెచ్చగొట్టేలా కులభూషణ్ జాదవ్పై మెసేజ్ పెట్టారు పాక్ హ్యాకర్లు
'జాదవ్ మృతదేహాన్ని త్వరలోనే మీకు పంపిస్తాం' అంటూ ఆ మెసేజ్ పోస్టు చేశారు. అయితే వెబ్సైట్ హ్యాకింగ్పై ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అప్రమత్తమైన ఏఐఎఫ్ఎఫ్ వెంటనే తమ వెబ్సైట్ను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య వల్ల నెటిజన్లకు కలిగిన అసౌకర్యానికి గానూ.. ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలిపింది.
Sorry for the inconveniences faced by you due to a technical glitch on https://t.co/7ahsAqfW77 . Please stay tuned, we'll come back shortly.
— Indian Football Team (@IndianFootball) May 9, 2017
అయితే జాదవ్పై హ్యాకర్లు పెట్టిన మెసేజ్ గురించి మాత్రం ఏఐఎఫ్ఎఫ్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అంతేగాక, భారతీయులకు స్నాప్డీల్కు, స్నాప్ఛాట్కు తేడా కూడా తెలియదని హ్యాకర్ మెసేజ్లో ఉంది.
గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్కు పాక్ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది.