లవ్: ఫ్రెండ్ తో కలిసి గెస్ట్ హౌస్ లో ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్, హత్య, బ్యాగ్ లో మృతదేహాం !
ప్రేమ ముసుగులో యువతిని నమ్మించి కర్ణాటక తీసుకు వచ్చిన కిరాతకుడు స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది.
బెంగళూరు: ప్రేమ ముసుగులో యువతిని నమ్మించి కర్ణాటక తీసుకు వచ్చిన కిరాతకుడు స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. ముంబైకి చెందిన ప్రీతి (22) అనే యువతి హత్యకు గురైయ్యిందని పోలీసులు చెప్పారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ప్రీతి గత రెండు సంవత్సరాల నుంచి ముంబైలోని ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నది. ముంబైకి చెందిన యువకుడిని ప్రీతి ప్రేమించింది. ప్రీతిని నమ్మించిన ఆమె ప్రియుడు విహారయాత్రకు అంటూ కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతానికి తీసుకు వచ్చాడు.

రత్నగిరిలోని ఓ గెస్ట్ హౌస్ లో వీరు బసచేశారు. మంగళవారం స్నేహితుడితో కలిసి ప్రియురాలు ప్రీతి మీద గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రీతి బెదిరించడంతో కత్తులతో పొడిచి ఆమెను దారుణంగా హత్య చేశారు.
ప్రీతి మృతదేహాన్ని పెద్ద బ్యాగ్ లో పెట్టి ట్యాక్సీలో బయలుదేరి బెళగావిలోని రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం సమీపంలోని బ్రిడ్జి కింద ఉన్న ఓ బావిలో విసిరివేశారు. తిరిగి వెలుతున్న సమయంలో ట్యాక్సీ డ్రైవర్ బ్యాగ్ ఎక్కడా అని ప్రశ్నించాడు.
మద్యం తాగిన మైకంలో ఉన్న నిందితులు ట్యాక్సీ డ్రైవర్ ఏమి చేసుకుంటాడులే అనే ధైర్యంతో ప్రీతిని హత్య చేసి బ్యాగ్ లో పెట్టి విసిరివేశామని చెప్పేశారు. ట్యాక్సీ డ్రైవర్ భయంతో బెళగావిలోని కాకతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతిని హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో పారిపోతున్న నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications