ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో సుదీర్ఘ సొరంగం!
భారతదేశ చరిత్రలోనే సరికొత్త మౌలిక వసతుల విప్లవానికి హిమాలయ పర్వత శ్రేణులు సాక్ష్యంగా నిలవబోతున్నాయి. శీతాకాలంలో భారీ మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వల్ల బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయే లడఖ్ ప్రాంతానికి.. ఇకపై ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని అందించే 'జోజిలా టన్నెల్' ప్రాజెక్ట్ అత్యంత కీలకమైన మైలురాయిని అధిగమించింది.
13.15 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన టన్నెల్ చివరి తవ్వకాల ఘట్టం (Final Breakthrough Blast) జూన్ 9న జరగబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ చారిత్రాత్మక తుది బ్లాస్టింగ్ను ప్రారంభించనున్నారు. దీంతో కాశ్మీర్, లడఖ్ మధ్య సర్వకాలీన అనుసంధానత (All-weather connectivity) కల సాకారం కాబోతోంది.

జమ్మూ కాశ్మీర్లోని బాల్తాల్ (సోనామార్గ్), లడఖ్లోని మీనామార్గ్ (ద్రాస్, కార్గిల్) ప్రాంతాల మధ్య సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల అసాధారణ ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన 'అతి పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్' (రోడ్డు రవాణా) సొరంగ మార్గంగా జోజిలా టన్నెల్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పనుంది. పర్వతాల పశ్చిమ ద్వారమైన బాల్తాల్ నుంచి తూర్పు ద్వారమైన మీనామార్గ్ వరకు ఇరువైపుల నుంచి అత్యాధునిక సాంకేతికతతో ఈ తవ్వకాలు జరిపారు.
हिमालय की दुर्गम उँचाईयों में आकार ले रही भारत की सबसे चुनौतीपूर्ण अवसंरचना : जोज़िला टनल!
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2026
मुख्य 'सुरंग ब्रेकथ्रू' समारोह : 9 जून 2026#ZojilaTunnel #AllWeatherRoad #TunnelBreakthrough #PragatiKaHighway #GatiShakti #BuildingTheNation pic.twitter.com/QurXHRD7mu
మేఘా ఇంజనీరింగ్ (MEIL) అద్భుత సృష్టి!
నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) పర్యవేక్షణలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నిర్మాణ దిగ్గజం 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' (MEIL) ఈ అసాధ్యమైన ప్రాజెక్టును సుసాధ్యం చేస్తూ నిర్మిస్తోంది. హిమాలయాల్లోని పెళుసైన భౌగోళిక పరిస్థితులు, ప్రమాదకరమైన మంచుచరియల (Avalanches) తీవ్రతను తట్టుకునేలా ఇందులో 'న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్' (NATM) సాంకేతికతను ఉపయోగించారు.
నిరంతర జియోటెక్నికల్ మానిటరింగ్, షాట్క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా ఇంజనీర్లు అత్యంత సురక్షితంగా ఈ భూగర్భ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఏప్రిల్ 2026 నాటికే ఈ ప్రాజెక్ట్ ఎటువంటి ప్రమాదాలు లేకుండా '10 మిలియన్ల సురక్షిత పని గంటలను' (Safe Man-hours) పూర్తి చేసుకోవడం విశేషం.
దేశ రక్షణలో వ్యూహాత్మక మైలురాయి
కేవలం ప్రజా రవాణా కోణంలోనే కాకుండా, దేశ భద్రత పరంగా ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ద్రాస్, కార్గిల్, లేహ్ వంటి సున్నితమైన ప్రాంతాలకు భారత సైన్యం, యుద్ధ సామాగ్రిని 365 రోజులూ ఎలాంటి ఆటంకం లేకుండా తరలించడానికి ఈ జోజిలా టన్నెల్ ఒక 'లైఫ్ లైన్'గా మారబోతోంది. గతంలో ఆరు నెలల పాటు మంచు కారణంగా నిలిచిపోయే మిలిటరీ లాజిస్టిక్స్ రవాణా.. ఇకపై నిరంతరాయంగా సాగనుంది.
The 13.153-km Zojila Tunnel, the world’s longest single-tube bi-directional road tunnel at the highest altitude, and its final breakthrough will be a historic milestone in India’s infrastructure history.
— ANI (@ANI) June 7, 2026
Located in the Zojila region between Baltal (Sonamarg) and Meenamarg (Drass… pic.twitter.com/CUstVp7zj0
2020లో మొదలైన మహా ప్రస్థానం..
ఈ మెగా ప్రాజెక్టు అప్రతిహత ప్రస్థానం 2020 అక్టోబర్ 1న ప్రారంభమైంది. మొత్తం అప్రోచ్ రోడ్లు, వంతెనలు, మంచు రక్షణ గ్యాలరీలు మరియు నిల్గ్రార్ జంట సొరంగాలతో కలిపి ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 30.894 కిలోమీటర్లు. ఇందులో మొదటి భాగమైన కనెక్టింగ్ హైవే పనులు, నిల్గ్రార్ జంట సొరంగాలు 2025 మార్చి 15 నాటికే విజయవంతంగా పూర్తయ్యాయి.
ఇప్పుడు ప్రధానమైన జోజిలా సొరంగం తవ్వకాలు కూడా ముగియడంతో, తదుపరి పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే లడఖ్ ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు స్థానిక ప్రజల దశాబ్దాల నాటి రవాణా కష్టాలు శాశ్వతంగా తీరిపోనున్నాయి.














Click it and Unblock the Notifications