సముద్రంలో బోటు మునిగి 71 మంది గల్లంతు
జకర్తా: గమ్య స్థానం చేరుకోకముందే ఓ బోటు సముద్రంలో మునిగిపోయింది. 71 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. ఇప్పటికే 7గురు మరణించారని మిగిలిన వారి ఆచూకి తెలియడం లేదని అధికారులు తెలిపారు.
ఇండోనేషియా దక్షిణ స్లువేసి ప్రావిన్స్ దగ్గర బోటు మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఇండోనేషియా దక్షిణ స్లవేసిలోని కొలక నుంచి సీవా నౌకాశ్రయానికి బోటు బయలుదేరింది. అందులో 118 మంది ప్రయాణికులు ఉన్నారు.
మార్గం మద్యలో స్లువేసి ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోటు సముద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 47 మందిని ప్రాణాలతో సురక్షితంగా రక్షించారు.
గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు. మునిగిపోయిన బోటు కోసం అధికారులు సముద్రంలో గాలిస్తున్నారు.