వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో బోటు మునిగి 71 మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

జకర్తా: గమ్య స్థానం చేరుకోకముందే ఓ బోటు సముద్రంలో మునిగిపోయింది. 71 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. ఇప్పటికే 7గురు మరణించారని మిగిలిన వారి ఆచూకి తెలియడం లేదని అధికారులు తెలిపారు.

ఇండోనేషియా దక్షిణ స్లువేసి ప్రావిన్స్ దగ్గర బోటు మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఇండోనేషియా దక్షిణ స్లవేసిలోని కొలక నుంచి సీవా నౌకాశ్రయానికి బోటు బయలుదేరింది. అందులో 118 మంది ప్రయాణికులు ఉన్నారు.

71 missing boat sinks in Indonesia

మార్గం మద్యలో స్లువేసి ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోటు సముద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 47 మందిని ప్రాణాలతో సురక్షితంగా రక్షించారు.

గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు. మునిగిపోయిన బోటు కోసం అధికారులు సముద్రంలో గాలిస్తున్నారు.

English summary
A total of 71 people were still missing three days after a boat carrying 118 people capsized in Indonesia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X